పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు తెలంగాణ పోలీసులు షాకిచ్చారు. గతకొంతకాలంగా నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో కార్లపై నజర్ పెట్టిన పోలీసులు నోటీసులు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ లోని అయ్యప్ప సోసైటికి వెళ్లే రహధారిలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా, హీరో ప్రభాస్ కు చెందిన కారు రాగానే సైబరాబాద్ పోలీసులు జరిమానా విధించారు. ఒకటి కాదు,రెండు కాదు ఏకంగా మూడు ఫైన్లు వేసి షాకిచ్చారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు మీడియాలోనూ హైలైట్ అయ్యింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్లితే.. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అదేశాల మేరకు దేశంలోని కార్లకు బ్లాక్ ఫిల్మ్ తొలగించాలని మార్గదర్శకాలు వచ్చాయి. కేవలం వై క్యాటగిరి భద్రత కలిగిన వ్యక్తులు మినహాయించి మిగతావారెవ్వరూ బ్లాక్ ఫిల్మ్ ను అద్దాలకు అంటించరాదని న్యాయస్థానం అదేశాలు జారీ చేసిన విషయం తలిసిందే. ఈ అదేశాల నేపథ్యంలో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో కార్లపై నజర్ పెట్టారున. ఏదేని కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉంటే వెంటనే జరిమానా వేయడంతో పాటు వాటిని తొలగిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే సినీప్రముఖులు అల్లు అర్జున్, మంచు మనోజ్, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నాగచైతన్య సహా పలువురి కార్లకు జరిమానా విధించారు. ఇక తాజాగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో నీరుస్ కూడలి వద్ద బ్లాక్ ఫ్రేమ్తో వెళ్తున్న కారు పోలీసుల కంటపడింది. కారును ఆపి పరిశీలించగా ఆ కారు ప్రభాస్ది అని తేలింది. నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం, ఎంపీ స్టిక్కర్, బ్లాక్ ఫ్రేమ్ ఉండటంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ. 1450 జరిమానా విధించారు. ఆ సమయంలో ప్రభాస్ కారులో లేరు. కాగా గతంలోనూ ఎన్టీఆర్, నాగ చైతన్య, మంచు మనోజ్ సహా పలువురు హీరోల కార్లకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పోలీసులు చలానా విధించిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more