కేరళ రాష్ట్ర ప్రజలకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ వంతుగా సహాయం అందించేందుకు ముందుకు వస్తున్న క్రమంలో టాలీవుడ్ లో ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘RX 100’ చిత్ర బృందం కూడా ముందుకొచ్చింది. కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. పాయల్ రాజ్పుత్ కథానాయిక. అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. అశోక్ రెడ్డి నిర్మాత. జులై 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది. సినిమా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లను రాబట్టింది.
ఈ చిత్రంలో కథానాయకుడు, కథానాయిక కలిసి యమహా RX 100 బైక్పై తిరుగుతారు. అయితే ఇప్పుడు కేరళ వరద బాధితుల కోసం ఈ బైక్ను వేలానికి ఉంచుతున్నట్లు కార్తికేయ ప్రకటించారు. దీని ద్వారా వచ్చిన మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తామని తెలిపారు. వేలం రూ. 50 వేల నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. వివరాలను This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.కు పంపాలని కోరారు.
‘కేరళలో జరుగుతున్న పరిణామాల గురించి మనకు తెలుసు. మనలా సంతోషంగా ఉండే చాలా కుటుంబాలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాయి. తోటి రాష్ట్రంగా వారికి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత మనది. ‘RX 100’ చిత్ర బృందం తరఫున బైక్ ను వేలానికి ఉంచి, వచ్చిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలి అనుకుంటున్నాం. నిజం చెప్పాలంటే.. నాకు జీవితంలో చాలా ముఖ్యమైన వస్తువు ఆ బైక్. జీవితంలో ఎప్పుడూ వదులు కోకూడదు అనుకున్నా. కానీ వారికి జరిగిన నష్టం ముందు ఇది చాలా చిన్న విషయం. మా సినిమాను మీరు ఎంతో ఆదరించారు. అంతకు మించి మీరు మద్దతుగా నిలవాల్సిన సమయం ఇది’ అని కార్తికేయ చెప్పారు
Please support this noble cause.Send your details and bidding amount to This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. or whatsapp to 9100445588 .Minimum bid amount is 50,000₹. pic.twitter.com/ywPER3y52a
— Kartikeya (@ActorKartikeya) August 20, 2018
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more