మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ధృవ తర్వాత సుక్కూతో రంగస్థలం అనే ఓ పిరియాడికల్ డ్రామాలో నటిస్తున్న చెర్రీ తన తర్వాతి ప్రాజెక్టు విషయంలో కూడా క్లారిటీ ఇచ్చేశాడు. వరుస హిట్ లతో జోరు మీదున్న డైరక్టర్ కొరటాల శివతో ఓ మూవీ చేయనున్నట్లు అనౌన్స్ చేసేశాడు.
నిజానికి మిర్చి సమయంలోనే వీరిద్దరి కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉంది. సమంత హీరోయిన్ గా ఎంపిక చేసిన ఈ సినిమా ముహుర్తం షాట్ కూడా జరుపుకుని తర్వాత కాన్సిల్ అయ్యింది. ఆ తర్వాత కొరటాల వరుసగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లతో బ్లాక్ బస్టర్ హిట్లు అందించాడు. దీంతో చెర్రీ ఈసారి స్వయంగా తానే కొరటాలను సంప్రదించి ఓ మంచి కథను సిద్ధం చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక కొరటాలతో సినిమా చేయబోతున్నట్టు చెర్రీ, కొరటాల, నిర్మాత నిరంజన్ రెడ్డితో ఉన్న ఓ ఫోటోను చెర్రీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు.
Here you go guys! Bankrolling #RCKoratalaFilm along with Matinee entertainments. Begins Summer 2018. pic.twitter.com/jOwSbzzu3S
— Konidela Pro Company (@KonidelaPro) July 11, 2017
చరణ్ సొంత బ్యానర్ కొణిదెల ప్రోడక్షన్, క్షణం ఘాజీ లాంటి మూవీలు తీసిన మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారితో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. 2018 లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. ప్రస్తుతం చరణ్ .. సుకుమార్ సినిమా 'రంగస్థలం 1985' షూటింగుతో బిజీగా వున్నాడు. ఇక కొరటాల వచ్చేసి .. మహేశ్ బాబుతో 'భరత్ అను నేను' సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక, ఈ కాంబినేషన్లోని మూవీ పట్టాలెక్కుతుందన్న మాట. అయితే ఎన్టీఆర్ తో ఓ మూవీ ఉంటుందని ఆ మధ్య కొరటాల అఫీషియల్ గా ప్రకటించాడు. అయితే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ కమిట్ అవుతుండటంతో ఈ గ్యాప్ లో చెర్రీతో ప్రోసీడ్ కాబోతున్నాడని స్ఫష్టం అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more