పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని నోవాటెల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి విచ్చేసి, థియేటర్ ట్రైలర్ మరియు ఆడియో సిడీలను విడుదల చేసారు.
ఈ సంధర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... సినిమాల్లో ముందు అమితాబ్ బచ్చన్ గారంటే పిచ్చి ఇష్టం వుండేది. కానీ అన్నయ్య(చిరంజీవి) హీరో అయిన తర్వాత అన్నయ్య ఒక్కరే నాకు కనిపించేవారు. మా అన్నయ్య గురించి చెప్పుకోవటం పెద్దగా ఇష్టపడను. కానీ సమయం, సంధర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెబుతాను. నన్ను ఆయన సినిమాల్లో చేయమంటూ చెప్పినపుడు నాకు అంత అర్హత వుందా? నేను ఆయనలా కష్టపడలేదు కదా అని అనిపించింది. నేను ఆయనకు పోలిటికల్ పరంగా నచ్చని పనులు కూడా చేసాను. నేను ఏ పరిస్థితిలో చేసానో ఆయనకు వివరణ ఇచ్చాను. ఆయన అర్థం చేసుకున్నారు కూడా.
మా బంధం వేరు.. రాజకీయాలు వేరు.. అవి రెండు దారులు. ఆయన గురించి పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గుండెల్లో వుంటారు. ప్రతిసారి చెప్పాల్సిన అవసరం, వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా విషయానికొస్తే... ఓసారి ఖమ్మం, ఛత్తీస్ ఘడ్ కు మధ్యలో ఓ బార్డర్ కు వెళ్లాను. అక్కడ ఓ లవ్ స్టోరీ చేయాలనుకున్నాను. అలాగే ఓ కౌబాయ్ సినిమా చేయాలనుకున్నాను. కానీ అది సినిమా రూపంలోకి రావడానికి చాలా సమయం పట్టింది. నాకు ఇంత సహకారం అందించిన నిర్మాత శరత్ మరార్ కు కృతజ్ఞతలు. ఇక ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కావాలని గత 50 రోజుల నుంచి చాలా కష్టపడి తీసాం. అందరిని కష్టపెట్టాను. వాళ్లు తిట్టుకున్నా లేకపోయినా.. అనుకున్న సమయానికి రావాలని.. నేను నిద్రపోకుండా... వారిని నిద్రపోనివ్వకుండా కష్టపడి చేసాం. నా సినిమాలు ఎవరికి పోటి కావు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more