వెంకట్ మూవీస్ బ్యానర్ పై పూజాగాంధీ, రఘుముఖర్జీ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం దండుపాళ్యం. ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘దండుపాళ్యం2’ మార్చి 24న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు శ్రీనివాస్ రాజు, నిర్మాత వెంకట్, బి.ఎ.రాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బి.ఎ.రాజు మాట్లాడుతూ.... 2013లో విడుదలైన దండు పాళ్యం ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ రూపొందనుంది. తెలుగు, కన్నడలో ఈ సినిమా తెరకెక్కనుంది’’ అన్నారు. నిర్మాత వెంకట్ మాట్లాడుతూ ‘’దండుపాళ్యం తెలుగులో పెద్ద సక్సెస్ సాధించింది. 2013లో ఆ చిత్రం విడుదలైంది. మూడు సంవత్సరాలు తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ను రూపొందిస్తున్నాం.మార్చి 24షూటింగ్ ను ప్రారంభించి జూన్, జూలైలో పూర్తి చేసి ఆగస్ట్, సెప్టెంబర్ లో సినిమాను రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. అందరి సహకారం ఉంటుందని భావిస్తున్నాం అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ రాజు మాట్లాడుతూ.... మూడేళ్ళ క్రితం విడుదలైన దండుపాళ్యం సక్సెస్ తర్వాత దానికి సీక్వెల్ ను మార్చి 24న ప్రారంభించనున్నాం. మధ్యలో రెండు సినిమాలు చేయడం వల్ల సీక్వెల్ వెంటనే చేయలేకపోయాను. ఆ సినిమా విడుదల సమయంలోనే నేను సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలియజేశాను. ఆ సినిమా కోసం నేను వివరాలు సేకరిస్తున్నప్పుడు క్రైమ్ లో కూడా ఇంత పెద్ద స్పాన్ మూవీ ఉంటుందా అనిపించింది. అసలు పార్ట్ వెనుక ఉన్న కథను ఈ చిత్రంలోచూపిస్తాం. పోలీస్ డిపార్ట్ మెంట్, మీడియా, ప్రజలు ఇలా ముగ్గురి కోణంలో సినిమా ఉంటుంది. ఒకరు ఒక మంచి పని చేస్తే ఎలా ఎక్కువగా చేసి చూపిస్తామో, క్రైమ్ జరిగినప్పుడు కూడా అంతే. నిజాన్ని ఉన్నదున్నట్లు ఈ చిత్రంలో చూపించబోతున్నాను. కాశీలో శివాలయంపై మసీదు, అయోధ్య రామమందిరంపై మసీదు ఇలా చరిత్రలో కొన్ని నిజ ఘటనలు మనం కాదనలేనివి జరిగాయి. అలాంటి బయోపిక్స్ ను ఆధారంగా చేసుకుని కూడా నేను సినిమాలు చేయబోతున్నాను. నిజానికి నేను ఈ స్టోరీ హేట్ చేస్తున్నాను. అయినప్పటికీ క్రైమ్ ను డైలూష్యన్ వేలో చూపిస్తున్నాను. సినిమాలో ఎలాంటి మెసేజ్ ఉండదు అన్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more