మార్కెట్ విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు ముందుగా ఊహించిన మాదిరిగానే రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా నిర్ణయం వెలువరించడంతో, మార్కెట్లలో ఎలాంటి కదలికలు కనిపించలేదు. సాధారణంగానే సెన్సెక్స్, నిఫ్టీలు కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 82.99 పాయింట్ల లాభంతో, 26,860 వద్ద, నిఫ్టీ 24.65 లాభంతో 8,225 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఇవాళ జరిగిన ద్రవ్యవిధాన పరపతి సమీక్షలో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ రెపోను 6.50శాతం, సీఆర్ఆర్ 4 శాతంగానే ఉంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజన్ నిర్ణయం స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. కేవలం భవిష్యత్ లో రేట్లు ఎలా ఉండబోతున్నాయో అనే ప్రకటనపైనే దలాల్ స్ట్రీట్ దృష్టిసారించింది.
దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232 పాయింట్లు లాభపడి 27,010 వద్ద ముగియగా, నిఫ్టీ 65 పాయింట్లు లాభపడి 8,266 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో ఎస్బీఐ సంస్థ షేర్లు అత్యధికంగా 5.66 శాతం లాభపడి రూ.210.15 వద్ద ముగిశాయి. వీటితోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెడ్ సిమెంట్, హిందాల్కో, అంబుజా సిమెంట్స్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. బీపీసీఎల్ సంస్థల షేర్లు అత్యధికంగా 1.91 శాతం నష్టపోయి రూ.975.30 వద్ద ముగిశాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా పవర్, అరబిందో ఫార్మా, ఇన్ఫోసిస్ సంస్థల షేర్లు నష్టాలతో ముగిశాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more