పెట్టుబడులే లక్ష్యంగా పార్ట్ నర్ షిప్ సమ్మిట్, ప్రత్యేక ఏర్పాట్లు చేసి హడావుడి చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిజానికి ఏం ఒరగబెట్టిందన్న చర్చ ఇప్పుడు మొదలైంది. విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన సీఐఐ సదస్సులో జరిగిన వ్యవహారం, ఆపై చంద్రబాబు నోటి నుంచి వెలువడ్డ లెక్కలు అంతా గజిబిజి గందరగోళంగా ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.
గతేడాది బిల్ గేట్స్ కలరింగ్ ఇప్పించి అంకెల గారడీ చేశాడంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం చూశాం. ఇక ఈ యేడాది సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అంటూ సుమారు 10.50 లక్షల కోట్ల పెట్టుబడులకు, 22 లక్షల ఉద్యోగాలకు సంబంధించి 665 ఒప్పందాలపై సంతకాలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు గర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ, వాటి వెనుక వాస్తవాలు ఎంతన్నది అనుమానంగానే ఉందని వారంటున్నారు.
అయితే ఆయన చెబుతున్న దానిలో పదో వంతు పెట్టుబడులు ఆచరణ రూపం దాల్చినా చాలన్నది వారి అభిప్రాయం. సదస్సుకు ఆర్థిక మంత్రితో సహా పలువురు అమాత్యులు, ప్రభుత్వానికి మద్ధతునిచ్చే పారిశ్రామిక మేధావులు పాల్గొన్నారు. ప్రతీ ఒక్కరూ చంద్రబాబు విజన్ గురించి, కఠోర శ్రమ, డైనమిక్ లీడర్ అంటూ పొగడ్తలు కురిపించారే తప్ప రాష్ట్రానికి చేయబోయే వాటి గురించి ఎక్కడా ప్రస్తావన తేలేదు.
ఓవైపు ప్రత్యేక హోదా గురించి మళ్లీ ప్రశ్నలు లేవనెత్తున్న సమయంలో ఆ టాపిక్ ఊసెత్తకుండా పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయంటూనే, కాకి లెక్కలు చెబుతున్నాడంటూ ఆర్థిక మేధావులు మండిపడుతున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి మద్ధతు లేకపోయినా తెలుగు నేలపై పెట్టుబడులకు మాంచి పరిస్థితులు ఉన్నాయంటూ కలరింగ్ ఇచ్చే పని చేశాడు. అలాంటి స్థితిలో ఏ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టేందుకు సాహసం చేయనే చేయదనేది వారి వాదన. ఓవరాల్ గా ఈ సమ్మిట్ ద్వారా జరిగబెట్టింది ఏంటయ్యా అంటే మాత్రం కేంద్ర మంత్రులతో సొంత డప్పు కొట్టించుకోవటమే... ప్రతిపక్షాలు సరిగ్గా ఈ పాయింట్ పట్టుకుంటే అధికార పక్షాన్ని అల్లాడించటం పెద్ద పనేం కాదు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more