ఏ ఎండకా గోడుగు పట్టడంలో రాజకీయ పార్టీల రూటే సపరేటు. అయితే గత మూడున్నర దశాబ్దాలుగా లేని మోజారిటీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వం ఇందుకు బిన్నమనుకున్నారు అందరు.
దానికి కారణం.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ అప్పటికే దేశాన్ని ఎలిన పార్టీలపై, వాటి విపరీతాలపై విమర్శలను గుప్పించడమే. అయితే అధికార పీఠం ఎక్కీ ఎక్కగానే దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికలలో మోడీ మానియాకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో దేశవ్యాప్తంగా బిజేపీ హవా కోనసాగాలన్న యావతో ఆ పార్టీ నేతలు కూడా ఏఎండకా గొడుగు పట్టడంలో నిష్టాతులుగా మారుతున్నారు.
అందుకే కాబోలు.. సార్వత్రిక ఎన్నికలు సహా.. మహారాష్ట్ర ఎన్నికలలో శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీపై విమర్శలను గుప్పించిన బీబేపి.. ఇప్పుడు ఆ పార్టీపై ప్రశంసలు గుప్పిస్తుంది. సుదీంద్ర కులకర్ణి ముఖానికి నల్లరంగు పూయడం, గులాం అలీ కచేరీని అడ్డుకోవడం వంటి చర్యలతో మహారాష్ట్రలో పంటికింద రాయిలా ఉన్న శివసేనతో సంబంధాలు తెంచుకునే దిశగా బిజెపి చురుగ్గా అడుగులు వేస్తున్న తరుణంలోనే అటు ఎన్సీపీని అక్కున చేకుర్చకునేందుకు కూడా చర్యలు చేపడుతోంది.
నిన్న మొన్నంటి వరకు అవినీతి పార్టీలకు తమ పార్టీ దూరంగా వుంటామని చెప్పిన బిజేపి.. విదేశాలలో భారత్ లో అవినీతి తగ్గించదన్న ప్రధాని ప్రసంగాలు కేవలం డాబే తప్ప అందులో నిజం లేదని ఈ నూతన కలయికలు రూడా చేస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలలో రాజీవ్ ప్రతాప్ రూడా ఎట్టి పరిస్థితుల్లో తామ పార్టీ ఎన్సీపీ అవినీతిపై విచారణ జరిపిస్తామమని హామీలు గుప్పించగా, ఇప్పుడదే పార్టీని అక్కున చేర్చుకుంటున్నారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. ఒకరు విచారణ జరిపిస్తామంటే మరోకరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
బారామతి ప్రాంత అభివృద్ధికి శరద్ పవార్ చేసిన కృషి మరవలేనిదని ప్రశంసల జల్లు జైట్లీ కురిపించారు. 50 ఏళ్లుగా పవార్ చేస్తున్న కృషి అంతా ఇంతా కాదన్నారు. కొంత కాలం క్రితం ప్రధాని మోదీ కూడా పవార్పై ప్రశంసల జల్లు కురిపించారు. నెలలో రెండు సార్లైనా తాను పవార్తో మాట్లాడి ఆయన అనుభవాలనుంచి పాఠాలు నేర్చుకుంటానని చెప్పారు. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బిజెపికి 123 మంది ఎమ్మెల్యేలున్నారు. అధికారంలో కొనసాగాలంటే 145 మంది ఎమ్మెల్యేలు తప్పని సరి. 63 మంది ఎమ్మెల్యేలున్న శివసేన తప్పుకుంటే 41 మంది ఎమ్మెల్యేలున్న ఎన్సీపీ మద్దతు తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఎన్సీపీకి మరింత దగ్గరయ్యేందుకు బిజెపి తీవ్రంగా యత్నిస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more