కేంద్రం హైకమాండ్ మాటల్లో మళ్లీ అఖిల పక్షం అనే మాటలు వినబడే సరికి టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు లో కొత్త అలజడి మొదలైంది. హైదరాబాద్ శాంతిభద్రతల అంశంపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు పార్టీ నేతలకు సూచించారు. ఆ విషయంలో కచ్చితంగా, నిర్దిష్టంగా ఉండాలన్నారు. తెలంగాణపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందానికి (జీవోఎం) సమర్పించే నివేదిక రూపకల్పన, మార్పు చేర్పులపై పార్టీ సీనియర్లు కె.కేశవరావు, కె.వి.రమణాచారి, ఎ.కె.గోయల్తో కేసీఆర్ సమావేశమయ్యారు.
హైదరాబాద్లో శాంతిభద్రతలపై కిరికిరి పెట్టాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని, ప్రధానమైన ఈ అంశంలో ఎలాంటి ఆంక్షలను అంగీకరించకూడదని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో 28 రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు ఎలాంటి నిర్ణయాలు జరిగాయో, తెలంగాణ విషయంలోనూ అలాంటి విధానమే ఉండాలన్న అంశం నివేదికలో పొందుపర్చాలని ఆయన సూచించారు. దీన్నే టీఆర్ఎస్ వైఖరిగా జీవోఎంకు స్పష్టంగా చెప్పాలన్నారు.
హైదరాబాద్ శాంతిభద్రతలపై రాజీపడితే భావితరాలు క్షమించవని, టీఆర్ఎస్ను ద్రోహిగా చరిత్రలో నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతాయని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 11 అంశాలపై టీఆర్ఎస్ వైఖరిని పేర్కొంటూ నివేదికను పార్టీ నేతలు రూపొందించారు. దీనికి తుదిమెరుగులు దిద్దడం పూర్తవుతుందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో పార్టీ నేతలు ఈటెల రాజేందర్, కేటీఆర్, జి. జగదీశ్రెడ్డి, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more