రాష్ట్రంలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల వరకూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో రాష్ట్రం అంతటా రెడ్ అలర్ట్ విధించారు. శెలవులలో ఉన్న జిల్లా స్థాయి అధికారులు అందరూ వెంటనే విధులలోకి చేరి సహాయ పునరావాస కార్యక్ర మాలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గత రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కోస్తా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులూ, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. లక్షలాది ఎకరాలు పంటలు నీట మునిగాయి. భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలకు అనేక నదులు పొంగి లోతట్టు గ్రామాలు, లంక గ్రామాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాలు జల దిగ్భంధనంలో చిక్కుకుపోయాయి. ఆర్టీసీ బస్సులు వరద నీటిలో మునిగి పోయాయి.
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం చప్టా వద్ద ఆర్టీసీ బస్సులు వాగులో చిక్కుకు పోవడంతో బస్సులో 40 మంది సాయం కోసం ఆర్తనాదాలు చేయడంతో జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి వారిని రక్షించే ఏర్పాట్లు చేసారు. ఈ బస్సు కర్నూలు నుండి వస్తొంది. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం గురువాయపాలెం గ్రామంలో చెరువు కట్ట తెగడంతో గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది. పశ్చిమ గోదావరి జిల్లా తమ్మిలేరు, ఎర్రకాలువలు ప్రమాదస్థాయి మించి ప్రవహిస్తున్నాయి. ఆచంట నియాజకవర్గంలోని చినమల్లం, సిద్దాంతం, మూలప్రరు తదితర గ్రామాలలోని నివాసాలలో వరద నీరు ప్రవేశించి ఇండ్లకు తీవ్ర నష్టం సంభవించింది. పెనుగొండలో విద్యుత్ సబ్ స్టేషన్ నీట మునిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం వద్ద బహుదా నదికి భారీగా వరద నీరు రావడంతో ఆర్టీసీ బస్సు, ప్రైవేటు బస్సు నీట మునిగాయి. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు 12 మంది మృతి చెందారు.
ప్రకాశం జిల్లాలో నలుగురు భారీ వర్షాలకు నీట మునిగి చనిపోయారు. గోడలు కూలి హైదరాబాద్లో ముగ్గురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కర్నూలు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున మృతి చెందారు. వరి పంట భాగా నష్ట పోయింది. 1884 గృహాలు నీట మునిగాయి. మహబూబ్నగర్లో 620 గృహాలు, నల్గొండ జిల్లాలో 446, మెదక్ జిల్లాలో 320, కడప జిల్లాలో 149, తూర్పు గోదావరి జిల్లాలో 124, విశాఖపట్టణంలో 106, పశ్చిమ గోదావరి జిల్లాలో 83, విజయనగరం జిల్లాలో 24, గుంటూరు జిల్లాలో 12 నీట మునిగి ధ్వంసం అయ్యాయి. మొత్తం మీద 4,611 మందిని 15 పునరావాస కేంద్రాలకు తరలించారు. విశాఖపట్టణంలో 1011 మందిని ఆరు పునరావాస కేంద్రాలకు, ప్రకాశం జిల్లాలో 3,500 మందిని ఏడు పునరావాస కేంద్రాలకు, నెల్లూరు జిల్లాలో 50 మంది, విజయనగరం జిల్లాలో 50 మంది ఒక్కొక్క పునరావాస కేంద్రానికి తరలించారు. 1.07 హెక్టా ర్లలో వరిపంట, 1.31 హెక్టా ర్లలో పత్తి, 28 వేల హెక్టార్లలో కందులు, 23 వేల హెక్టార్లలో జొన్న, 9,636 హెక్టార్లలో మిరప, 5,766 హెక్టార్లలో కూరగాయల పంటలు ధ్వంసం అయ్యాయి.
రాష్ట్రం మొత్తం మీద 110 పశువులు భారీ వర్షాలకు మృతి చెందాయి. గుంటూరు జిల్లాలో 104 గొర్రెలు, విజయనగరం జిల్లాలో 5 గొర్రెలు, విశాఖపట్టణం జిల్లాలో ఒక పాడి పశువు మృతి చెందాయి. మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్లో చెరువుకు గండి పడడంతో పంట పొలాలు నీట మునిగాయి. ఈ గ్రామానికి ఇతర గ్రామాలకు సంబంధాలు లేకుండా పోయింది. పలు ప్రాంతాలలో చెరువులకు గండ్లు పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు పది ఆర్టీసీ బస్సులు వరద నీటిలో మునిగిపోయాయి.
భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలను, రైతులను వెంటనే ఆదుకోవాలని, తక్షణమే పునరావస చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్ రెడ్డి ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మంచినీరు, మందులు సరఫరా చేయాలని, నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు. మరో 24 గంటల వరకూ రాష్ట్రంలో పలు జిల్లాల లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందు వల్ల అన్ని జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి బాధితులను తక్షణమే ఆదుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వరదలలో చిక్కుకు పోయిన వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more