2014 సార్వత్రిక ఎన్నికల్లోపు రాష్ట్ర విభజన జరిగే అవకాశాలు లేవని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కుండబద్దలు కొట్టారు. తాను మొదటి నుంచి సమైక్యవాదినని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. విభజనపై కాంగ్రెస్ అధినాయకత్వం పునరాలోచించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో జయాపజయాలకంటే ప్రజలే ముఖ్యమని, ప్రజాభిప్రాయానికి అధినాయకత్వం కూడా తలొగ్గి నిర్ణయంపై పున:పరిశీలిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ విభజనకు సంబంధించి అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టానని, ఆ సమయంలో రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఈ రెండు ఉద్యమాలను ఒకే కోణంలో చూస్తున్నానని వెల్లడించారు. సీమాంధ్రలో ఇంత పెద్ద ఉద్యమం వస్తుందని తమ పార్టీ అధినాయకత్వం ఆలోచించలేదని చెప్పారు. సీమాంధ్ర ఉద్యమం ఏ పార్టీ చేతిలో లేదని, ఈ ఉద్యమంలో ప్రజలు, ఉద్యోగులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత విభజన నిర్ణయాన్ని ప్రకటించాలని తాను అధినాయకత్వాన్ని కోరినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత విభజన నిర్ణయం ప్రకటించాలని కూడా పదేపదే అభ్యర్థించానని, ఎన్నికల్లో పార్టీని గెలిపించకపోతే రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటానని స్పష్టం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. విభజన వ్యవహారంలో శ్రీకృష్ణ కమిటీ 6వ అధ్యాయమే ఖాయమవుతుందని భావించామని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన లేఖల వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ఆరోపించారు. ఇచ్చిన మాటకు కట్టుబడినందునే అధినాయకత్వం తెలంగాణ నిర్ణయాన్ని ప్రకటించిందని ఆయన చెప్పారు. తెలంగాణ విషయంలో కొంతమంది హైకమాండ్ను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. విభజన విషయంలో రాజకీయ నిర్ణయాలు దురదృష్టకరమని, ప్రజల గురించి ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రాన్ని విభజిస్తే ప్రజల భవిష్యత్ దెబ్బతింటుందని, ఇదే విషయాన్ని తాను పదేపదే చెబుతున్నానని తెలిపారు. తన భవిష్యత్ ముఖ్యం కాదని, ప్రజల భవిష్యత్తే శాశ్వతమని ఆయన పునరుద్ఘాటించారు.కొత్త పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని, కాంగ్రెస్వాదిగానే ఉంటానని చెప్పారు. విభజనలో తాను భాగస్వామ్యం కాలేనని, మనసాక్షికి విరుద్ధంగా తాను వ్యవహరించలేనని, సమైక్య రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళే అవకాశం తనకివ్వాలని, పార్టీని గెలిపించకపోతే శాశ్వతంగా ఏ పదవిని తీసుకోబోనని పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి స్పష్టం చేశానని కిరణ్ వివరించారు.
అసెంబ్లిలో తెలంగాణపై అర్థవంతమైన చర్చ జరుగుతుందన్న ఆశాభావంతో ఉన్నానని చెప్పారు. విభజన వల్ల వచ్చే నష్టాలను ముందే చెప్పలేక పోయానన్న అపప్రద తనపై ఉండకూడదని, అందుకే తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా అధినాయకత్వానికి తెలియజేశానని పేర్కొన్నారు. గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అసెంబ్లికి రెండు, మూడు దఫాలు తీర్మానం వచ్చి రెండు, మూడేళ్ళ తర్వాత రాష్ట్రాలు ఏర్పడ్డాయని, మన రాష్ట్రం విషయంలోనూ అదే సంప్రదాయాలు పాటిస్తారని పార్టీ పెద్దలు చెప్పారని కిరణ్ తెలిపారు. రాజ్యసభ సభలో ఆర్థికమంత్రి చిదంబరం విభజన అంశం చర్చకు వచ్చినప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం చాలా కాలంగా ఉందని, కాబట్టే పరిష్కారం చూపాలని కాంగ్రెస్ పార్టీ భావించిందని అన్నారు. కానీ ఈ సమస్య పరిష్కారం వల్ల ఎక్కువ సమస్యలు వచ్చే ఆస్కారం ఉన్నప్పుడు అధిష్ఠానం కూడా దీనిపై మరోసారి ఆలోచిస్తుందని ఆయన తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more