మూడేళ్ల నుండి మౌనంగా గెలుస్తున్న ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి శుక్రవారం 54వ ఏట అడుగిడబోతున్నారు. 1960 సెప్టెంబర్ 13న ఆయన జన్మించారు. ప్రజలు ఆశించే సుపరిపాలన సాధిస్తామని దాదాపు మూడేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తానిచ్చిన హామీని అమలు పర్చడంలో అప్రతిహతంగా దూసుకుపోతూ, తన విమర్శకుల ప్రశంసలు సైతం అందుకోగలుగుతున్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, విధానపరమైన లోపాలను ప్రక్షాళన చేయడమే ప్రధాన కర్తవ్యమని చెబుతూ ఆ దిశగా కార్యోన్ముఖులయ్యారు. జనం ఆశించేది పసిగట్టి అనేక వినూత్న పథకాలను ప్రకటించి విజయవంతంగా అమలు జరుపుతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయి. పరిస్ధితులను ఎప్పటికప్పుడు పసిగడుతూనే అడుగులు ముందుకేస్తూ ప్రజల ఆకాంక్షలు తీర్చే దిశగా పయనం సాగిస్తున్నారు. రాజీవ్ యువకిరణాలు, రూపాయికి కిలో బియ్యం, ఇందిర జల ప్రభ, రచ్చబండ, స్తీ నిధి, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతులకు వడ్డీలేని పంటరుణాలు, మీ సేవ, కౌలు రైతు చట్టం, ధరల నియంత్రణకు పర్యవేక్షక కమిటీ, స్టేట్ మిల్స్ మిషన్, విద్య, ఉచిత విద్యుత్, జల యజ్ఞం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, సామాజిక పింఛన్లు, ఉపకార వేతనాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు, మైనారిటీలకు ప్రత్యేక కమిషన్, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, బంగారు తల్లి, తదితర పధకాలను సమర్ధవంతంగా అమలు జరుపుతున్నారు. మీ సేవ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. సిటిజన్స్ ఛార్టర్ ప్రవేశపెట్టి పురపాలక సంఘాల్లో సేవలను మెరుగుపరిచారు.
ఉపాధి హామీలో సామాజిక తనిఖీలను అమలు జరిపి పారదర్శకతకు ప్రాధాన్యతనిచ్చారు. నిరుపేద కుటుంబాలకు రూపాయికి కిలో బియ్యం, అమ్మహస్తం పేరుతో రూ. 185లకే తొమ్మిది నిత్యావసరాలను చౌక ధరలో అందచేస్తున్నారు. 1989లో తొలిసారిగా శాసనసభకు ఎన్నికైన కిరణ్కుమార్రెడ్డి 2010లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో విమర్శలు చేసిన వారందరకి ధీటైన సమాధానంగా పాలన సాగిస్తున్నారు. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం, రచ్చబండ, ఇందిరమ్మ కార్యక్రమాలతో గ్రామాలు పర్యటించడంతో ప్రజలకు చేరువయ్యారు. క్షేత్ర స్ధాయిలో వాస్తవాలను తెలుసుకొని పాలనలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను చక్కదిద్దడం, కేంద్రం నుండి అధిక నిధులు రాబట్టడంలో తనదైన వ్యూహంతో ముందుకు సాగి సానుకూల ఫలితాలను సాధించారు. వ్యవసాయానికి చేయూతనిచ్చి, మహిళలకు సాధికారత కల్పించడంలో రాష్ట్ర ఆర్ధిక ప్రగతిని పెంచేందుకు కిరణ్కుమార్రెడ్డి చేసిన కృషి సానుకూల ఫలితాలను ఇస్తుంది. గెలుపు ఓటములను సమానంగా తీసుకోగలిగిన ఆటగాడుగానే కిరణ్కుమార్రెడ్డి ఎన్ని విమర్శలు, నిందలు ఎదురైనా తాను విశ్వసించిన సుపరిపాలన అందించి తీరుతాననే లక్ష్యంతో ముందుకు తీసుకెళుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more