సెప్టెంబర్ 7న హైదరాబాద్ లో ఏం జరగబోతుంది ? అందరిలో ఇదే టెన్షన్ ? ఏ ఉగ్రవాద సంస్థో దాడులు చేయడం లేదు కానీ.... ఏపీఎన్జీఓల మధ్య, తెలంగాణ వాదుల యుద్దం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జులై 30వ తేదీన కేంద్రం ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత సీమాంధ్రలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమానికి మధ్దతుగా ఏపీ ఎన్జీఓలు ‘సేవ్ ఆంద్రప్రదేశ్ ’ పేరుతో ఈనెల 7న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. సీమాంధ్రులకు పోటీగా తెలంగాణ వాదులు కూడా అదే రోజు శాంతి ర్యాలీల పేరిట ర్యాలీలు చేయడానికి సిద్ధం అయ్యారు. కానీ ప్రభుత్వం మాత్రం ఏపీఎన్జీఓల సభకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చి, తెలంగాణ వాదులకు మాత్రం అనుమతి నిరాకరించారు. దీంతో తెలంగాణ వాదులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. సీమాంధ్రుల సభ నేపధ్యంలో నిరసనలు తెలిపేందుకు తెలంగాణ జేఏసీ, ప్రజా సంఘాలు భారీ ప్రణాళికను రూపొందిస్తున్నాయి. ఇటు సీమాంధ్రులు, అటు తెలంగాణ వాదులు సై అంటే సై అనడంతో శుక్రవారం రాజధాని నగరం వేడెక్కబోతుంది.
సీమాంధ్రులు సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటుంటే.... ఇటు తెలంగాణ వాదులు మాత్రం ఈనెల 7వ తేదీన తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చి, 48 నుండి 72 గంటల పాటు ఈ బంద్ ను నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఏపీ ఎన్జీఓల సభకు సీమాంధ్ర ప్రాంతం నుండి వచ్చే బస్సులు, రైళ్ళు రాకుండా ఆయా మార్గాలను దిగ్బందించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీని నేడు తెలంగాణ ఐకాస స్టీరింగ్ కమిటీ సమావేశం కూడా నిర్వహించి తుది నిర్ణయం తీసుకోబోతుంది. అనుమతి ఇవ్వకున్నా తాము ర్యాలీ జరిపి తీరుతామని టీ-జేఏసీ అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్కు అనుమతించడం వెనుక హైదరాబాద్లో అల్లర్లు సృష్టించే కుట్ర ఉన్నట్లు ఇతర నేతలు పేర్కొన్నారు.
అవాంఛనీయ సంఘటనలు జరిగితే అందుకు సర్కారుదే బాధ్యత అని హెచ్చరించారు. నగర కమిషనర్ అనురాగ్ శర్మ, డీజీపీ దినేశ్ రెడ్డిని కలిసి తమ అభ్యంతరాలు తెలిపారు. మంత్రి జానారెడ్డితోనూ భేటీ అయ్యారు. తమ పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నారని... దీనిని నిలువరించాల్సిన బాధ్యత టీ-మంత్రులదే అని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో 6వ తేదీన ఎమ్మార్పీఎస్ తలపెట్టిన సభకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. దాంతో తెలంగాణ జేఏసీ, విద్యార్థి సంఘాలు, ఎమ్మార్పీఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, అన్ని రీజియన్ల ఐజీలతో డీజీపీ వి.దినేశ్రెడ్డి బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తానికి మరో 48 గంటల్లో రాజధానిలో హై టెక్షన్ నెలకొనబోతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more