ఇప్పుడు అమ్మ మనసు సీమాంద్ర కొత్త రాజధాని పై ఉంది. కొత్త రాష్ట్రం రాజధాని ఎక్కడ అనే దాని పై ఢిల్లీ పెద్దలతో చర్చలు వేగవంతంగా జరుపుతున్నారు. అయితే నిన్నటి వరకు విజయవాడ , గుంటూరు పేర్లు ఢిల్లీ పెద్దల మద్య చర్చకు వచ్చాయి. కానీ ఇప్పుడు కొత్తగా మరో పేరు మీదకు అమ్మ మనసు మారిపోయింది. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడన్నదే ప్రశ్న సరికొత్త రాజధాని సృష్టికి ముందుగా, ప్రధానంగా కావాల్సింది భూమి. ఇప్పటికే సీమాంధ్రలోని అన్ని ప్రధాన పట్టణాల్లో భూమి విలువ చుక్కలనంటు తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పెనుభారంగా మారనున్న భూసేక రణ అంశమే రాష్ట్ర రాజధాని ఎక్కడన్నదాన్ని నిర్ణయిస్తుందని ఓ సమాచారం.సరిగ్గా ఓ మధ్యతరగతి మానవుడు ఇల్లు కట్టుకోవాలంటే.. వేసుకున్న బడ్జెట్లానే కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తోందని, భూమి చవగ్గా ఉన్న చోట రాజధాని ఏర్పాటు చేయడం తేలిక అవుతుందనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కేవలం భూమి సమస్య కారణంగానే సీమాంధ్రలో ప్రధాన నగరాలు రాజధానిగా మారే అవకా శాన్ని కోల్పోయాయని తెలుస్తోంది. అందుకే మరోముంబై, వైజాగ్, సీమాంధ్రకు సరిగ్గా మధ్యలో ఉన్న విజయవాడ లేక గుంటూరు, ఇటు అంతర్జాతీయ పుణ్యక్షేత్రం తిరుపతి, పాత రాజధాని కర్నూలు కూడా రాజధాని రేసులో లేవనే అంటున్నారు. మరెక్కడ అంటే.. సీమాంధ్రలోని అన్ని జిల్లాలకు అందుబాటులో భూమి రేటు తక్కువగా ఉండే, ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన ముప్పై వేల ఎకరాలున్న ఒంగోలు పేరు ఎక్కువగా వినబడుతోంది.కొత్తగా రాష్ట్ర రాజధానిని నిర్మించాలంటే పునాదుల నుంచి మొదలెట్టాలి. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి, మౌలిక వసతుల ఏర్పాటుకు వేల ఎకరాల భూమి అవసరమవుతుంది. ఒక్క భూ సేకరణకే లక్షల కోట్లు వెచ్చించాలి. అందుకే గతంలో అనుకున్న వైజాగ్ లేదా తిరుపతి ప్రతిపాదన వెనక్కి వెళ్లిందని తెలుస్తోంది. తిరుపతిని లేదా వైజాగ్ను పక్కన బెట్టడానికి మరో కారణం.. కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రానికి రెండూ ఆ చివర, ఈ చివర ఉండడం.
దీంతో పాలన సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని కేంద్రం భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నగరాల్లో స్థల సేకరణ అతి పెద్ద విషయం. రైతుల వద్ద నుంచి భూసేకరణ.. తాజా సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పెద్ద వివాదంగా మారే అవకాశముందని కేంద్రం భావన. కృష్ణ, గోదావరి జిల్లాల్లో దాదాపు భూములన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభుత్వ భూమి లేకపోవడంతో రాజధాని ఏర్పాటు సమస్యే ఉండదని అంటున్నారు. గతంలో న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఒంగోలులో సేకరించిన భూమి అలానే ఉంది. అప్పట్లో కాంగ్రెస్లోనే కొన్ని కీలక శక్తుల న్యూక్లియర్ ప్లాంట్ ఏర్పా టును వ్యతిరేకించాయి. దాని కన్నా రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేస్తేనే ఒంగోలు ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే వారి వ్యూహంగా ఉన్నట్లు ఢిల్లిలో రాజకీయ వర్గాల్లో వినవస్తున్న వాదన. ప్రస్తుతానికి అమ్మ మనసు ఒంగోలుపైనే ఉందని విశ్వసనీయ సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more