రాష్ట్రం ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ హైకమాండ్, తెలంగాణ ఫై రోడ్ మ్యాప్ సమార్పించిన విషయం తెలిసిందే. ఆ రోడ్ మ్యాప్ తో పాటు రెండు వందల పేజీలు కలిగిన బుక్ ను సోనియాగాంధీకి అందజేసినట్లు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ముఖ్యమంత్రి సమర్పించిన రోడ్ మ్యాప్ లో తెలంగాణ అభివ్రుద్ది కి కావాలసిన రోడ్ మ్యాప్ అని ఢిల్లీ పెద్దలు అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ ఏర్పాడితే.. జరిగే నష్టాన్ని మాత్రమే కోర్ కమిటీలో వివరించారు. కానీ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం గురించి కోర్ కమిటీలో చెప్పలేకపోయాడు. గతంలో దివంగత నేత వైఎస్ఆర్ ఉన్నప్పుడు సోనియా గాంధీ , ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎలాంటి భయం ఉండేది కాదట. ఆ తరువాత వచ్చిన, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల వల్ల సోనియాగాంధీకి అధిక టెన్షన్ తో భయపడుతుందని ఢిల్లీ పెద్దలు అంటున్నారు.
సోనియాలో అంతగా భయపెడుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? వైఎస్ఆర్ కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పటి వరకు సోనియా గాంధీకి ఎదురునిలబడిన వ్యక్తుల్లో వైఎస్ జగన్ రెండోవాడు. మొదటి వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి. ఢిల్లీలో వైఎస్ ఫవర్ ఏమిటో చూపించినట్లు సీనియర్ కాంగ్రెస్ అంటున్నారు. అసమర్థలైన నాయకులు వందమంది ఉండే కంటే.. సమర్థుడైన నాయకుడు ఒక్కడు ఉన్న పార్టీకి కొండంత బలం అని గతంలోనే సోనియా గాంధీకి అర్థమైంది. జరుగుతున్న పరిణమాల ద్రుష్ట్యా .. స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్న పర్వలేదు.. కానీ కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే విధంగా వైఎస్ జగన్ బలం పెరిగిపోయిందనే విషయాన్ని ఇటీవల కొన్ని సర్వేలు బహిరంగంగా చెబుతున్నారు.
అందుకు ఉదాహరణ పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , వైఎస్ జగన్ తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇలా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ను దెబ్బ కొట్టి, బలమైన నాయకుడిగా నిలబడితే... కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి అనే ఆలోచనలతో సోనియాగాంధీ లో సరికొత్త భయం పుట్టినట్లు ఢిల్లీ పెద్దలు అంటున్నారు. అందుకే కిరణ్ బలాన్ని పక్కని పెట్టి, వైఎస్ జగన్ బలాన్ని కాంగ్రెస్ పార్టీలోకి కలుపుకునే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. వైఎస్ జగన్ కు బంఫర్ ఆఫర్ ఇవ్వటానికి సోనియాగాంధీ సిద్దమైనట్లు సమాచారం. అందుకోసం ముందుగా కేవిపీతో చర్చలు జరుపుతున్నట్లు ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more