గతంలో ఒకసారి విజయం సాధించిన ఆయన మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం రాష్ట్రంలో అడుగుపెడుతున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ను ఆడబోతున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో పూర్తి స్థాయిలో పార్టీ రాష్ట్ర వ్యవహారాలను చక్కదిద్దిన ఆయనకు పార్టీ అధిష్టానం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కు అవకాశం కల్పించింది.రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి గా ఆయన మళ్లీ నియమితులయ్యారు. 2004ఎన్నికల తర్వాత గులాం నబీ ఆజాద్ నుంచి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన, 2014 ఎన్నికలకు ముందు కూడా మళ్లీ అదే సీన్ రిపీట్ అవబోతోంది. ఆ ఆజాద్ నుంచే దిగ్విజయ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు తీసుకోబోతుండటం విశేషం. 2009 ఎన్నికల వరకు ఆయన పార్టీ రాష్ట్ర బాధ్యతలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలపై, రాష్ట సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. రాష్ట్ర వ్యవహారాలన్ని ఆయనకు కొట్టిన పిండి వంటివే.
అందుకే అధిష్టానం పార్టీ రాష్ట్ర వ్యవహారాలను తిరిగి మళ్లీ ఆయనకే అప్పగించింది. తెలంగాణ అంశం, కేసీఆర్ వ్యవహార శైలీ, వామపక్షాలతో సంబంధాలు వంటి అంశాలపై దిగ్విజయ్ సింగ్ కు పూర్తి అవగాహన ఉంది. 2004లో యూపీఏ-1 ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి తెలంగాణ అంశాన్ని ఆయన చాలా క్షుణ్నంగా పరిశీలించారు. కేసీఆర్ ఇంటికి వెళ్లి ఎన్నోసార్లు తెలంగాణ పై చర్చలు జరిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ లను ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఇద్దరినీ ఓకే చోట కూర్చొబెట్టి విలేకరులతో మాట్లాడించారు. కేంద్రం , రాష్ట్రం లోని మంత్రి పదవుల నుంచి టిఆర్ఎస్ వైదొలగినపుడు కూడా ఈయనే ఇన్ చార్జిగా ఉన్నారు.రాష్ట్రంలో వామపక్షాలు తీవ్రస్థాయిలో భూపోరాటంతో ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేసినపుడు సీపీఎం కార్యాలయానికి వైఎస్ఆర్ వెంటబెట్టుకుని వెళ్లి ప్రకాశ్ కరత్, ఏచూరీ లాంటి వారితో చర్చలు జరిపారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని వెంటబెట్టుకుని వామపక్షాల కార్యాలయానికి వెళ్లిన సందర్బాలు గతంలో ఎన్నడూ జరగలేకపోవడం విశేషం.
ప్రభుత్వ పదవుల జోలికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలకే అంకితం కావడం ఈయన బలం. అందరికీ అందుబాటులో ఉంటూ అందరి సాదకబాదకాలను అర్థం చేసుకునే ఓర్పు నేర్పు ఉన్న వ్యక్తి దిగ్విజయ్. చిరునవ్వుతో ఎదుటివారిని తొలిచూపులోనే ఆకట్టుకునే వ్యక్తి కూడా. దిగ్విజయ్ ఆగ్రహావేశాలకు లోనయ్యే సందర్భాలు చాలా అరుదనే చెప్పొచ్చు. అయితే గతంలో వైఎస్ ఒంటెత్తు పోకడలు చూస్తూ ఊరుకున్నారన్న విమర్శలు ఈయనపై వచ్చాయి. ఆనాటి వైఎస్ అవినీతిని నిలువరించడంలో గానీ, అధిష్టానానికి వాస్తవం చెప్పడంలోగానీ విఫలం అయ్యారన్న అపవాదం దిగ్విజయ్ పై ఉంది.
దిగ్విజయ్ గతంలో నిర్వర్తించిన బాధ్యతలు ఒక ఎత్తయితే ఇప్పుడు చేపట్టబోయే బాధ్యతలు మరో ఎత్తు. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి సవ్యంగా ఉండింది. దీంతో ఆయన పయనం పూలబాటలా సాగింది. కానీ ప్రస్తుతం ఆయనకు ఎటు చూసినా ముళ్లబాటే కనిపిస్తోంది. ఒకవైపు తెలంగాణ అంశం, మరో వైపు జగన్ వ్యవహారం..మరోవైపు కాంగ్రెస్ ఫిరాయింపులు..అత్తెసరు మెజార్టీతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం దిగ్విజయ్ ముందు ఉన్న పెను సవాళ్లుగానే చెప్పవచ్చు. దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, గోవా బాధ్యతలు కూడా చూడాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల్లో కర్ణాటక, ఏపీలో వచ్చే ఎంపీల సంఖ్యను బట్టి కేంద్రలో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉంటుంది. కాబట్టి దిగ్విజయ్ ముందు ప్రస్తుతం భారీ సవాళ్లు ఉన్నాయనే చెప్పొచ్చు. మరీ ఈ సవాళ్లను ఆయన ఏ విధంగా అధిగమించి, పార్టీని మళ్లీ గాడీలో పెడతారో లేదో వేచి చూడాల్సిందే..
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more