రాష్ట్రం ప్రజలు ఇప్పుటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు . సంపాదించిన సొమ్మునంత కరెంట్ బిల్లు రూపంలో ప్రభుత్వం తన్నుకుపోతున్నా సమయంలో సామాన్య ప్రజల పై మరో పెను భారం వేయ్యటానికి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఇక నుండి దూరపాంతాల్లో ఉన్న బంధువుల ఇంటికి బస్సులో వెళ్లితే ప్రయాణీకులకు తో(టోలు) ఊడీపోద్దని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఇక నుండి మీరు జాతీయ రహదారిపై వెళ్లితే చాలు ప్రభుత్వం టాక్స్ కట్టాల్సిందే. జాతీయ రహదారుల్లో సంచరిస్తున్న ఆర్టీసి బస్సులు చెల్లిస్తున్న టోల్గేట్ ఫీజులను ప్రయాణీకుల నుంచే వసూలు చేస్తోంది.
అయితే వీటిని బారీగా పెంచుతూ ఆర్టీసి ప్రతిపాదనలు పంపించగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి క్షణాల్లో ఆమోదం తెలుపుతూ సంతకం చేశారు. ఆర్టీసి నిర్వహిస్తున్న పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఒక్కో టోల్గేట్కు ఒక్కొక్కరినుంచి నాలుగు రూపాయలు, డీలక్స్, సూపర్లగ్జరీ, ఇంద్ర, గరుడ వాహనాల్లో అయిదు రూపాయలు, గరుడప్లస్, వెన్నెల వాహనాల్లో ప్రయాణిస్తున్న వారినుంచి ఆరు రూపాయలు వసూలు చేయాలని ప్రతిపాదనలు పంపించింది. జాతీయరహదారిపై ఉన్న ఒక్కో టోల్గేట్కు మాత్రమే ఈమొత్తం వసూలు ఉంటుందని, రెండు మూడు టోల్ గేట్లుంటే రెండు మూడుసార్లు ఈమొత్తాన్ని వసూలు చేసుకునే వీలుకల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
దీంతో నేడో రేపో ప్రయాణీకులపై మరో బారం పడనుంది. ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం అంటేనే జంకుతున్న ప్రయాణీకులను మచ్చిక చేసుకునేందుకు పథకాలు రూపొందించాల్సిందిపోయి వారిపైనే భారం మోపుతూ సంస్థ చేసిన ప్రతిపాదనలు నివారించాల్సింది పోయి ముఖ్యమంత్రి ఫైలుపై సంతకం చేయడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ఇలా అయితే సామాన్య ప్రజలు దూరప్రాంతాలకు ప్రయాణించే సమయంలో రైలు ప్రయాణాన్నీ ఆశ్రయిస్తాడు, దీని వలన ఆర్టీసి భారీ ఎత్తున్న నష్టం వస్తుందని ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలు, ప్రయాణీకులు అంటున్నారు. ప్రభుత్వం తీరు చూస్తే.. ఆర్టీసీని ప్రైవేటు పరంగ చేసేందుకు అడుగులు వేస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more