మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 90వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణితో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకకు రావాలని తనకు పిలుపు రాలేదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు ఉదయం అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ మళ్లీ జన్మలోనూ ఎన్టీఆర్ కుటుంబంలోనే పుట్టాలని కోరుకుంటున్నానని అన్నారు.
తనకు మహానాడుకు రావాలని పిలుపు అందలేదని, ఆహ్వానం వస్తే మాత్రం తాను తప్పకుండా వెళతానని ఆయన చెప్పారు. తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడతానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిదే ఘన విజయమని, అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. టిడిపి కోరితే ప్రచారం చేయటానికి సిద్ధంగా వున్నానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
తెలుగుజాతి బతికున్నంత కాలం మర్చిపోలేని నేత ఎన్టీఆర్ అని, భౌతికంగా లేకున్నా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని కోరారు. జూనియర్ ఎన్టీఆర్ దంపతులతో పాటు కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి, నందమూరి హరికృష్ణ, కల్యాణ్ రామ్ తదితరులు నివాళులు అర్పించారు. పురంధేశ్వరి మాట్లాడుతూ... ఎన్టీఆర్ కూతురుగా పుట్టడం తన అదృష్టమన్నారు.
ఆయన ఆశయాల కోసం పని చేస్తామన్నారు. నందమూరి హరికృష్ణ మాట్లాడుతూ.. అన్నగారి ఆశయాలను తాము ముందుకు తీసుకు వెళ్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపియే అధికారంలోకి రావాలన్నారు. పార్టీ గెలుపు కోసం తామంతా కృషి చేస్తామన్నారు.
ఎన్టీఆర్ కుటుంబమంతా ఒక్కటిగానే ఉందని...తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని హరికృష్ణ అన్నారు. సినిమాల్లో కానీ, రాజకీయాల్లోగానీ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more