ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఏం చేస్తున్నారు? అక్కడ జరుగుతున్న చర్చలు ఏమిటని రాజకీయ నాయకులు ఆలోచన్లో పడ్డారు. కేవలం నామినేటెడ్ పదవులు అయితే ఇంత చర్చ ఉండదు. ఆరోపిత మంత్రుల విషయం లోనో,లేక కొందరు అసమ్మతి మంత్రుల తొలగింపు విషయంలోనో ఎక్కడో అబిప్రాయ బేధాలు వచ్చి ఉండాలి, అందుకే ప్రకటనలో ఆలస్యం జరుగుతుందన్న ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద కిరణ్ డిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడిందనే చెప్పాలి. ఇక మరోవైపు పిసిసి చీఫ్ బొత్స విశాఖకు తిరుగు ప్రయాణమయ్యారు.
అయితే రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ స్థాయిలో చేయాల్సిన మార్పు చేర్పులపై సస్పెన్స్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ విషయంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్తో ఏకాంతంగా రెండుగంటల పాటు మంతనాలు జరిపారు. రాత్రి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారా యణతో కలిసి ఆజాద్ నివాసానికి వెళ్లారు. ఈసారి పార్టీ పరిశీలకుడు కృష్ణమూర్తి కూడా చర్చల్లో పాల్గొన్నారు. సంస్థాగత వ్యవహారాలు, పీసీసీ కమిటీల ఏర్పాటుపై కసరత్తు జరిపారు.
అర్ధరాత్రి దాటాక కూడా వీరి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వంలో చేపట్టాల్సిన మార్పుల గురించే వీరి మధ్య ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆరోపిత మంత్రుల స్థానంలో కొత్త నేతల నియామకంపై కూడా అధిష్ఠానం దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కిరణ్, బొత్సల వాదనలను ఆజాద్ సావధానంగా విన్నట్లు తెలుస్తోంది. తాజా నియామకాల్లో కర్ణాటకలో మాదిరిగా వివిధ సామాజిక శక్తుల సమికరణ జరగాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. గత వారమే బొత్స ఢిల్లీకి వచ్చి పార్టీ పునర్వ్యస్థీకరణకు సంబంధించి జాబితాతోపాటు రాష్ట్రంలో రాజకీయ మార్పులపై తన ప్రతిపాదనలను అందించారు.
రాష్ట్ర రాజకీయ పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో భాగంగానే సోనియా రాష్ట్ర నేతలను కలుసుకుంటున్నారని, వివిధ కోణాల నుంచి పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆమె ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, రాష్ట్ర మంత్రి రఘువీరారెడ్డిలతో సమావేశమైన విషయం తెలిసిందే. కిరణ్, బొత్సల పనితీరు తెలుసుకోవడంతోపాటు పార్టీ పునర్వ్యవస్థీకరణ, వివిధ పదవులను భర్తీ చేయాల్సిన అవసరాన్ని సోనియా, రాహుల్ గుర్తించారని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి సోనియాను కలుసుకుని సాయంత్రం హైదరాబాద్ తిరిగి రావాల్సి ఉండగా అనూహ్యంగా పర్యటన ఆగిపోయింది. దీంతో ఏం జరుగుతుందో అన్న అనుమానాలు బలపడ్డాయి. ఢిల్లీలో ఏదో రాజకీయ హడావుడి నడుస్తున్నట్లే ఉంది. ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పిలిచిన అదిష్టానం పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణను కూడా ఢిల్లీకి రావాలని కబురు చేయడం, ఆయన బయల్దేరడం తో రాజకీయ వర్గాలలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.అయితే ఇవేవి కావు ఆరోపిత మంత్రులపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా డిల్లీలో చర్చలు జరుగుతున్నాయని ఇంకొందరు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more