నువ్వువస్తాని .. ఎదురుచూసిన అభిమానులకు నిరాశ మిలిగింది. అయితే నిరాశతో మేము కుంగిపోకుండా, నీ రాక కోసం, పార్టీని బలపేతం చెయ్యటానికి , 2014లో ఎన్నికల్లో పార్టీ విజయం సాధించటానికి మనం అడుగులు వెయ్యాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజయమ్మ పిలుపునిచ్చారు. జగనన్నకు బెయిల్ రావటం సమయం పడతుంది కాబట్టి మనం గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థలతో పాటు వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో అందరినీ కలుపుకొని ఐక్యంగా పని చేయాలని సూచించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏకమై వైఎస్సార్సీపీని ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నాయని.. వాటిని తిప్పికొట్టాలని పేర్కొన్నారు. లోటస్పాండ్లోని వైఎస్సార్సీపీ విసృ్తత స్థాయి సమావేశం జరిగింది. కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కొండా సురేఖ దంపతులు కూడా ఈ భేటీకి హాజరు కావడం గమనార్హం.
విభేదాలను పక్కనపెట్టి అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి పార్టీని పటిష్టతకు కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి నాయకులను ఎంచుకొని అభ్యర్థిగా బరిలో నిలపాలని సూచించారు. పార్టీ తరఫున గ్రామ స్థాయి నుంచి మంచి నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్నారు. పార్టీలో అందరూ ఐక్యంగా పని చేస్తూ, అందరినీ కలుపుకోవాలని సూచించారు. ప్రధాన ప్రతిపక్షం అండతో కిరన్ ప్రభుత్వం ఎలాంటి భయం లేకుండా ప్రజలపై పన్నుల భారం మోపుతోందని విమర్శించారు.
తమ ఉనికికే ప్రమాదమని రెండు పార్టీలు కలిసి వైఎస్సార్సీపీని లేకుండా చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. అందుకే జగన్మోహన్రెడ్డిని కేసుల్లో ఇరికించి, జైలులో పెట్టించారన్నారు. జగన్ను జైలులో ఉంచి ఏడాది కావొస్తోందని, దీనిపై కూడా ప్రజల్లోకి వెళ్లాలన్నారు. వైఎస్సార్సీపీ ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్టీడీపీ రెండు కలిసిపోయాయని, అసెంబ్లీలోనూ, ఎన్నికల్లోనూ కలిసి నడుస్తున్నాయని తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించేందుకు రెండు పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని.. వాటిని తిప్పికొట్టాలని పార్టీ నేతలకు సూచించారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని.. ఇప్పటి నుంచే పార్టీ ఎన్నికలకు సిద్ధం కావాలని తెలిపారు. జగన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారి.. దీన్ని పార్టీలోని ప్రతి ఒక్కరూ గమనించి ప్రజల్లోఉంటూ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. అయితే ఈ పార్టీకి కొణతాల, మరి కొంత మంది నాయకులు హాజరు కాలేదని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more