వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి జలక్ మీద జలక్ లు తగులుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కొండా దంపతులు పార్టీని వీడుతారనే ప్రచారం సాగింది. కానీ ఇవాళ వారు జగన్ ని కలిసి తాము పార్టీని వీడటం లేదని చెప్పారు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడ శానససభ్యుడు అయిన కొడాలి నాని తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి, జగన్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈయన ఇప్పుడు ఆ పార్టీకి జలక్ ఇస్తారా ?అనే అనుమానునాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ విప్ ని దిక్కరించిన కొంత మంది తెదేపా ఎమ్మెల్యేలు అందురు స్పీకర్ మనోహర్ దగ్గరికి వెళ్లి హాజరయ్యి, తమపై వేటు వేయాలని వారు కోరారు. తెలంగాణకు చెందిన వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి మాత్రం విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరు కావడానికి తనకు కొంత సమయం ఇవ్వాలని కొడాలి నాని స్పీకర్ను కోరారు. అయితే అందరి లాగా కాకుండా నాని తనకు కొంత సమయం కావాలని అడగటం వెనుక ఏదో ఉందని, అందుకే సమయం కోరాడని అంటున్నారు. కొడాలి నాని జగన్ పార్టీలో చేరడం పై గుడివాడ కార్యకర్తలు తీవ్ర అసంత్రుప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం జగన్ పార్టీలో జరుతున్న పరిణామాలను పరిగణలోకి తీసుకొని తన రాజకీయ భవిష్యత్తు పై పునరాలోచన చేసుకోవడానికి స్పీకర్ ని కొంత సమయం అడిగాడని ఆయన వర్గంలో ఓ మాట వినిపిస్తుంది. అయితే మరి కొందరు మాత్రం ప ఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోవడం వల్లనే అలా చేసి ఉంటారని అంటున్నారు. ఏది ఏమైనా వీటన్నింటికి తెర పడాలంటే నాని నోరు విప్పాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more