సమాజ సేవ చెయ్యటానికి అన్నా హజారే తో కలిసి ముందు ఉద్యమించి, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ మార్చి 23 న ప్రారంభించిన నిరాహార దీక్షను ఈ రోజు 14 వ రోజున విరమించారు. ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన కేజ్రీవాల్, ఢిల్లీలో సుందరినగర్ లో విద్యుత్ ఛార్జీలలో జరిగిన గణనీయమైన పెంపుకి నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు. ఛార్జీలు తగ్గేంత వరకూ నిరవధికంగా దీక్ష సాగుతుందని చెప్పిన కేజ్రీవాల్ ను అన్నా హజారే తన పంజాబ్ పర్యటనకు ముంద కలిసి, ముందు ముందు ఉద్యమాలు చెయ్యవలసి ఉంది కాబట్టి మరో రెండు రోజుల కంటే ఎక్కువ దీక్ష చెయ్యవద్దని చెప్పి వెళ్ళారు.
ఆ తర్వాత కూడా దీక్ష విరమించవలసిందిగా సందేశాన్ని పంపించగా కేజ్రీవాల్ ఆ మాటకు అంగీకరించి ఈ రోజు దీక్ష విరమించటానికి నిన్ననే నిర్ణయించుకుని ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. దీక్ష విరమణను అన్నా చేతుల మీదుగా పండ్ల రసంతో చెయ్యటానికి ఉత్సుకతను అన్నా కి చెప్పినా, పర్యటనలో ఉన్న ఆయన తను రాలేకపోతున్నానని చెప్పారు. ఆయన ఆశీర్వాదముందిగా చాలు అంటూ కేజ్రీవాల్ ఈ రోజు దీక్షను విరమించారు.
విద్యుత్ కట్టకపోవటం వలన విద్యుత్ కనెక్షన్ ని కట్ చేసిన వారికి సాయంగా కార్యకర్తలు వస్తారని తిరిగి కనెక్షన్ ఇస్తారని కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపా కూడా రావని ఆయన జోస్యం కూడా చెప్పారు.
అయితే, ఎవరీ కేజ్రీవాల్, నలభై సంవత్సరాలుగా ఢిల్లీ వాసుల కష్టాలు ఎందుకు చూడలేకపోయాడు, ఉన్నట్టుండి రెండు రోజుల్లో దీక్షల డ్రామాలతో ఒక్కసారిగా ఢిల్లీ మీద ప్రేమను, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత మీద విమర్శలను గుప్పిస్తున్న కేజ్రీవాల్ లక్ష్యం రాజకీయ లబ్ధి కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జెపి అగ్రవాల్. పాలకవర్గం తప్పు మార్గంలో సవాల్ చేస్తూ, బిల్లులు కట్టవద్దని, కట్ చేసిన కనెక్షన్ ని తిరిగి ఇస్తామని ప్రకటనలు చేస్తున్న ఇలాంటి వాళ్ళకి మద్దతునివ్వటం సరికాదన్నారాయన.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more