మన రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ కొత్త ప్రయోగానికి తెరలేపారు. రాష్ట్రంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులకు గవర్నర్ హాజరవుతున్నట్లు సమాచారం. రైతులతో నేరుగా గవర్నర్ మాట్లాడే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. రెవెన్యూ సదస్సుల పట్ల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఆసక్తి కనబరుస్తున్నారని, కొన్ని గ్రామాలకు వెళ్లి ఈ సదస్సులను పరిశీలిస్తానంటూ చెప్పారని రెవెన్యూ శాఖ మంత్రి ఎన్ రఘువీరా రెడ్డి అధికారులతో అన్నారు. గ్రామీణ రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తీరుతెన్నులపై జిల్లా అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై తాను గవర్నర్ను కలిసి వివరించానని, వీటి నిర్వహణ పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారన్నారు. గ్రామీణ ప్రాంతాలకు రెవెన్యూ అధికారులు వెళ్లడం వల్ల ప్రజల్లో, మరీ ముఖ్యంగా రైతుల్లో ఆత్మవిశ్వాసం కలుగుతుందని పేర్కొన్నారన్నారు. అయితే గవర్నర్ ఏ ఏ గ్రామాలకు వెళతారో, ఎప్పుడు వెళతారో వివరించలేదన్న ఆయన వీలును అనుసరించి రెవెన్యూ సదస్సుల్లో పాల్గొంటారని తెలిపారు. కాబట్టి రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రెవెన్యూ సదస్సుల లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సులకు ప్రభుత్వ పరంగా ప్రాధాన్యత ఉందని, శాసనసభలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వస్తోందన్నారు.
ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఇచ్చిన సమాధానంలో గ్రామ రెవెన్యూ సద్సుల అంశం ప్రస్తావించారని, అలాగే ఆర్థిక శాఖ మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో రెవెన్యూ సదస్సుల గురించి వివరించారని గుర్తు చేశారు. రెవెన్యూ సదస్సుల సందర్భంగా ప్రజల నుండి వచ్చే అన్ని ఫిర్యాదులను రికార్డు చేయాలని, ఆన్లైన్లో ఉంచాలని రఘువీరా ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఏవైనా అర్జీలు తిరస్కరిస్తే, అందుకు కారణాలు ఏమిటో అర్జీదారుడికి వివరించాలని ఆదేశించారు. జిల్లాల నుండి తనకు అందిన సమాచారం మేరకు అన్ని జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు చక్కగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే కొన్ని శాఖల అధికారులు, బ్యాంకర్లు ఈ సదస్సులకు హాజరు కావడం లేదని తెలిసిందని, ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు శ్రద్ధ తీసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని రఘువీరా విజ్ఞప్తి చేశారు. గ్రామ రెవెన్యూ అధికారులకు కార్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటు చేయాలని, తర్వాత శాశ్వత భవనాల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more