విశ్లేషణ-
కృషి చేస్తే సాధించలేనిదేమీ లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ మాటల్లో తెలుస్తోంది. మొదట్లో మెతకతనం బేలతనం కనిపించిన ఆయనలో రాజకీయాల్లో రాటుతేలినట్టుగా ఇప్పుడు అనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో మాకు ప్రధాన ప్రత్యర్థి తెలుగు దేశం పార్టీయే అన్నారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. దీనికి ఎన్ని అర్థాలన్నా తీయవచ్చు. కాంగ్రెస్ పార్టీని, తెలుగు దేశం పార్టీలను తప్ప ఆయన మిగిలిన పార్టీల ప్రాముఖ్యతను ఏమాత్రం గుర్తించటం లేదన్న ఈ మాటలతో తెలిసిపోతోంది. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంలో తెదేపా మద్దతు నివ్వనందుకు కూడా ఆ విషయానికి గౌరవించినట్లు కూడా తెలుస్తోంది.
విపక్షాల అవిశ్వాస తీర్మానం పార్టీని ఇంకా బలోపేతం చేస్తుందని, ఈ మాత్రందానికే ప్రభుత్వం పడిపోతుందని తను అనుకోవటం లేదని కూడా అన్నారు. అంతే కాదు కొన్ని పార్టీలకు గ్రామ స్థాయి గుర్తింపు ఏమాత్రం లేదని కూడా అన్నారు. ఆయన మాటలు, తెలుగుదేశం పార్టీని మినహాయించి మిగిలినవన్నీ ఎప్పుడో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతాయనే సంకేతం కూడా ఇచ్చాయి. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీని గంగానదితో పోలుస్తూ, అందులో ఎన్నో పార్టీలు చేరుతుంటాయి, విడిపోతుంటాయని ఆయన అన్నారు. ఈ మాటలతో కిరణ్ కుమార్ ఇతర పార్టీలను లెక్క చెయ్యకపోవటమే కాకుండా, తెదేపాకే ప్రాముఖ్యతనివ్వటంతో దానిమీద ఇప్పటికే కాంగ్రెస్ తో కుమ్మక్కయిందని ఆరోపిస్తున్న మిగిలిన పార్టీలు మరోసారి తెదేపాను విమర్శించటానికి అవకాశం కూడా దొరుకుతుంది. అలా విపక్షాలు తమలో తాము కజ్జాలు పెట్టుకుంటుంటే ప్రభుత్వానికి లాభమే మరి.
తెలంగాణా సమస్య గురించి మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ కి కూడా సమస్యేనని కిరణ్ కుమార్ అన్నారు. అంటే దానిగురించి తెరాస రాద్ధాంతం చెయ్యవలసిన అవసరం కానీ దానిమీద అవిశ్వాస తీర్మానం పెట్టవలసిన అవసరం కానీ లేదని ఆయన అర్థం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే తెలంగాణా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తాను తీసుకోవలసిన చర్యలను తాను తీసుకుంటుందని ఆయన అన్నారు. కేంద్రం చెయ్యవలసిన పనికి రాష్ట్రంలో ఎలుగెత్తితే ఏం లాభమని కూడా అర్థం వచ్చేటట్టుగా ఆయన మాట్లాడారు.
మొత్తం మీద ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన దగ్గర్నుంచీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ పాఠాలను బాగా వంటబట్టించుకున్నారని, ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవటంలో ఒక మెట్టు పైకి ఎక్కారని తెలుస్తోంది. అందువలన కృషి చేస్తే అనుకున్నది సాధించవచ్చు, ఇతరులను సాదించనూవచ్చు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more