రాజకీయాల్లో పోటీ రాకండి మీ జోలి మాకొద్దు వచ్చారో విమర్శలు తప్పవు.
ప్రస్తుత రాజకీయ చదరంగంలో ఎప్పటిలా ఎత్తుకు పై ఎత్తు ఎలాగూ వెయ్యాలి కానీ దానికంటే ముందుగా కొత్తవాళ్ళు అడుగుపెడితే జాగ్రత్త పడాలి అనే స్వభావం కనిపిస్తోంది.
రాజకీయాల్లోకి రాకుండా మీరు ఏమైనా చేసుకోండి పట్టించుకోం. కానీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారో మీ గురించి పూర్తి వివరాల కూపీ లాగటం, మీరు, మీకు సంబంధించిన మనుషులు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ కుటుంబ విషయాలు, కూడగట్టిన ఆస్తిపాస్తులు ఒకటేమిటి, ప్రతి ఒక్కదాన్నీ మూలం లోంచి లాగి మిమ్మల్ని ఇరుకున పడేస్తాం. ఇదీ నేటి రాజకీయ సిద్ధాంతం. రాజకీయాల్లో ఎక్కడో ఏదో మూల ఉంటే పరవాలేదు కానీ జనాదరణ వస్తుందంటే మాత్రం మిగతా పార్టీల్లో గుబులు బయలుదేరుతుంది. ఎలాగైనా ఆ అభ్యర్థిని నైతికంగా దిగజార్చాల్సిందే, అతని మీద దుమ్మెత్తి పొయ్యాల్సిందే. సొంత పార్టీల్లోంచి ఇతర నాయకుల దగ్గర్నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం చాలా ఉంది.
ఎందకంత పట్టుదల. ప్రజాక్షేమాన్ని ఆశించా. ప్రజాసంక్షేమాన్ని కోరుకుంటున్నాం కాబట్టి ఇతరుల అవినీతి పరుల, అసమర్థుల బారిన పడకూడదనే మేము ప్రజలను హెచ్చిరిస్తున్నామని వారు సమర్థించుకోవచ్చు కానీ నిజమేమిటో అందరికీ తెలుసు.
రాజకీయాల్లో పెద్ద ఎత్తున అక్రమ సంపాదనకున్న అవకాశం ఆకర్షణీయంగా మారింది. ఇక రెండవది పలుకుబడి. సమాజంలో పలుకుబడితో ఎన్నో పనులు జరిగిపోతాయన్నది చాలామంది నమ్మేది. వీటి వలన అధికారం చేజిక్కించుకోవాలనే తపన పెద్ద స్థాయిలో పోటీలకు దారితీసి, ప్రతివాళ్ళూ తమ గొప్పతనాన్నీ, మంచితనాన్ని చాటుకోవటం, ఇతరుల వక్రబుద్ధి, అసమర్థతలను ఎత్తిచూపటమే పనిగా పెట్టుకుంటున్నారు.
ఇవన్నీ చూసి సామాన్య ప్రజానీకం సందిగ్ధంలో పడుతోంది. ఎవరిని నమ్మాలి, ఎవరిని వద్దు అన్నది తెలియటం లేదు కాబట్టి ఎవరో ఒకరులే అని పట్టించుకోనివారే చాలామంది. అయితే వాళ్ళకి ఊరట, కాస్తంత వినోదమేమిటంటే, రాజకీయ బరిలో ఉన్నవాళ్ళంతా ఒకరి నొకరు విమర్శించుకోవటం, తిట్టుకోవటం చెయ్యటంతో ప్రతి ఒక్కరూ హాస్యానికి తావిస్తున్నారు. పెళ్ళైనప్పుడు ఫొటో తీస్తూ పెళ్ళికొడుకు మిత్రుడు, వేదాంతి స్మైల్ అంటూ, నవ్వు ముఖం పెట్టమని, ఎందుకంటే అదే ఇక అతని ఆఖరి నవ్వు అవుతుందని, అందువలన జీవితాంతం కనీసం నవ్వు ముఖాన్ని చూసుకోవటానికైనా ఆ ఫొటో పనిచేస్తుందని అన్నాడట. అలాగే, రాజకీయాల్లో ఎవరు గెలిచినా ఓడిపోయేది ఓటరే అని విమర్శకులన్నట్టు, కనీసం ప్రచారం సమయంలోనైనా ఒకరినొకరు తిట్టుకుంటూ, విమర్శించుకుంటూ, హేళన చేసుకుంటూ, హెచ్చరికలు చేసుకుంటూ, ప్రతిఙలు, సవాళ్ళు విసురుకోవటాలు, బెదిరింపులు చేస్తూ అందులో తమ తెలివిని, పాండిత్యాన్నంతా ఉపయోగిస్తుంటే, ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ప్రస్తుతం నవ్వుకోవటానికి పనిచేస్తుందనుకుంటున్నాడు ఓటరు. వాళ్ళ మీద కార్టూన్లు, టివిల్లో అనుకరణలు అందరికీ నవ్వు తెప్పిస్తుంటాయి.
వైయస్ ఆర్ కాంగ్రెస్ నాయకుడు వైయస్ జగన్ గురించి అంతకు ముందు పెద్దగా ఎవరికీ తెలియదు, ఎవరూ పట్టించుకోలేదు కానీ రాజకీయాల్లోకి రాగానే, అతను, ఆయన తండ్రి చేసిన అవినీతి, ఆయన సంస్థలు, ఆదాయ వనరులను కలుగజేసే ఆయన మిత్రులు అందరూ బయటికొచ్చారు. అంతకు ముందు మనకెందుకులే అన్నట్టున్నా, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఏ పని చేసినా దాన్ని అందరూ భూతద్దంలో చూడటం మొదలుపెడతారు.
చిరంజీవి మెగా స్టార్ గా ఎంతోమంది అభిమానాన్ని చూరగొన్నారు. ఇలా రాజకీయాల్లోకి ఇంకా రానేలేదు, వస్తారేమో అనే వార్తలు మీడియాలో రావటం మొదలవగానే వ్యతిరేకతలు, మాటలకు పెడార్థాలు తియ్యటాలు, కార్టూన్లు మొదలయ్యాయి. జయప్రకాశ్ నారాయణని మొదట్లో పట్టించుకోలేదు కానీ ఆయన చెప్పేదానిలో అర్థముందని వివేకవంతులు, చదువుకున్న వర్గం అనుకోవటం మొదలవగానే ఆయన మీద వ్యాఖ్యానాలు మొదలయ్యాయి, శాసన సభ ప్రాంగణంలోనే చెయ్యి చెయ్యి లేచాయి. తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకున్నట్టు కనిపించగానే వివిధ వ్యాఖ్యలు మొదలయ్యాయి, ఆయన ఆస్తుల మీద కేసులు వెయ్యటం ప్రారంభమయ్యాయి.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ తన రాష్ట్రంలో ఏం చేసుకుంటున్నారో మనకెందుకు అని అనుకున్నవాళ్ళే, ఆయన పేరు మారుమోగిపోతుండటం, భాజపా పుంజుకుంటూ కనిపించటంతో మోదీ మీద ఆరోపణలు, ఆయన మీద సవాళ్ళు మొదలయ్యాయి.
అవినీతిమీద పోరాటం చేస్తున్న అన్నా హజారే ని కూడా వదిలిపెట్టలేదు. ఆయన రక్షణ విభాగంలో పనిచేస్తున్నప్పటి రికార్డ్ లను కూడా భూతద్దంతో చూసారు ఎక్కడైనా ఏమైనా దొరుకుతుందేమోనని. ఆయనకు వచ్చిన జనాదరణ చూసి చాలామంది నాయకుల గుండెల్లో గుబులు మొదలైంది.
యోగా గురువు రామ్ దేవ్ బాబా అంటే దేశమంతా ఎంతో గౌరవం ప్రదర్శించేవారు. దేశంలో ఎక్కడికి పోయినా టిక్కెట్లు దొరక్క, కార్లు పార్క్ చెయ్యటానికి స్థలం దొరక్క ఇబ్బంది పడ్డారు. అలాంటి బాబా రాజకీయాల్లో ఆసక్తి చూపించటం మొదలుపెట్టగానే ఆయన ఆస్తులు, ట్రస్ట్ వివరాలు అన్నీ తనిఖీల పాలయ్యాయి.
తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు మీద అలాగే విరుచుకు పడదామని అన్ని పార్టీలూ ప్రయత్నించినా తెలంగాణా సెంటిమెంట్ ఆయన్ని కాపాడింది. అప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో అపఖ్యాతి అంటగట్టారు.
అంతకు ముందు ఉన్న వ్యక్తులే రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనాదరణ పొందుతున్నారని తెలిస్తే చాలు మిగతావాళ్ళంతా కలిసి ఎవరికి తోచిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళంతా ఇతర నాయకులకు ఇచ్చే సందేశమొక్కటే. మీరు ఏం చేసుకుంటారో మాకు తెలియదు, మాకు అనవసరం. కానీ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఊరుకోం. మిమ్మల్ని ఎలాగైనా ఎండగడతాం. పోటీలో ఎంత మంది తగ్గిపోతే అంత కచ్చితమైన గెలుపు లభిస్తుంది, అంత లాభమూ ఉంటుంది మరి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more