త్రివేణీ సంగమంలో అత్యంత వైభవంగా సాగుతున్న కుంభమేళాలో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. రెండు విషాదకర సంఘటనలో 36 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమంలో మూడు కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అంచనా. అయితే భక్తులు తిరుగు ప్రయాణం కోసం రైల్వే స్టేషన్కు చేరుకోవడంతో, స్టేషన్ జనసంద్రంగా మారింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా త్రొక్కిసలాట జరగడంతో కనీసం 36మంది చనిపోగా, వందలాది మంది గాయపడ్డారు. సాయంత్రం 7 గంటల సమయంలో రైల్వే స్టేషన్లోని ఐదు, ఆరు ప్లాట్ఫారాలు వేలాది ప్రయాణికులతో క్రిక్కిరిసిపోయిన సమయంలో తొక్కిసలాట జరిగింది. ఆరో నంబరు ప్లాట్ఫామ్పైకి రైలు వస్తున్నట్టు అనౌన్స్మెంట్ రాగానే, రైలు ఎక్కడానికి వేలాదిమంది ఒక్కసారిగా పరుగులు తీశారు. ప్లాట్ఫామ్కు వెళ్లే ఫుట్ఓవర్ బ్రిడ్జికి చెందిన రెయిలింగ్ కూలిపోయి తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. సంఘటన జరిగిన మూడు గంటల తర్వాత ప్లాట్ఫామ్పై తొక్కిసలాటలో చనిపోయిన పదిమంది మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు.
కాగా తొక్కిసలాటలో పదిమంది చనిపోయారని, వందలాది మంది గాయపడ్డారని రైల్వే డివిజనల్ మేనేజర్ హరీందర్ రావు చెప్పారు. గాయపడిన వారిని హుటాహుటిన వివిధ ఆస్పత్రులకు తరలించారు. కాగా సంఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు రైల్వే శాఖ ఆదేశించింది. అలహాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించడంపై ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సాయాన్ని అందించాలని రైల్వే అధికారులను ఆదేశించారు. సహాయ కార్యక్రమాల్లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని విధాలా తోడ్పాటు అందించాలని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వ శాఖలను ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more