తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమరదీక్షలో చేసిన తిట్ల దండకం రాష్ట్రంలో పెద్ద హాట్ టాఫిక్ గా మారింది. అయితే ఢిల్లీ నేతల సైతం కేసిఆర్ చేసిన విమర్శలపై కదలినట్లు తెలుస్తోంది. దేశ తొలి ప్రధాని జవాహర్ లాల్ నెహ్రు, మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శించే స్థాయి టిఆర్ఎస్ ఆధ్యక్షుడు కె చంద్రశేఖర రావుకు లేదని లోక్సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. కెసిఆర్ వ్యవహరించిన తీరుకు కాంగ్రెస్వాదుల రక్తం మరుగుతోందన్నారు. దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు ‘అమ్మా’ అని పిలుచుకునే ఇందిరమ్మను విమర్శించే హక్కు ఆయనకు ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే చిత్తశుద్ధి కెసిఆర్కు ఉందా? అని ఉండవల్లి నిలదీశారు. సోనియాని విమర్శించటం అంటే ప్రతి కాంగ్రెస్వాదిని విమర్శించటమేనన్నారు. అన్ని రాజకీయ పార్టీలను విమర్శించటం ద్వారా తెలంగాణ సమస్యను 2014 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల వరకు సాగదీసి ఎక్కువ సీట్లు సంపాదించుకున్న తరువాత తన పబ్బం గడుపుకోవాలనే దురాశతోనే కెసిఆర్ ఇలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కెసిఆర్ చెప్పినదంతా పచ్చి అబద్దమన్నారు. జల దోపిడీ గురించి తప్పుడు మాటలు మాట్లాడటం మంచిది కాదని సూచించారు. ఒక పార్టీ అధ్యక్షుడుగా ఉంటూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల కలలు సాఫల్యం కావని ఉండవల్లి స్పష్టంచేశారు.
సీమాంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య చర్చలు జరగకుండా చేస్తురన్నారు. రాష్ట్ర ప్రజల హృదయాలలో వైషమ్యాలు, అసహ్యాలు, అనుమానాలు రెచ్చగొడుతున్నారని, తెలంగాణ మేధావులు ఈ విషయాన్ని గ్రహించాలన్నారు. కాంగ్రెస్ సూత్రప్రాయంగా తెలంగాణకు అనుకూలమని, అయితే ఆంధ్రా, రాయలసీమ పెట్టుబడులు, జల వివాదాలు ఉన్నందున, వాటిని పరిష్కరించుకోకపోతే తెలంగాణ రాదన్నందుకు తనను కెసిఆర్ సన్నాసి అని విమర్శిస్తాడా? అని ఆయన నిలదీశారు. తెలంగాణ ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్న వ్యక్తి కెసిఆరేనని, చిన్న రాష్ట్రాలు ఏర్పడితే తప్పేమిటని అడిగే తనలాంటి వ్యక్తుల నోరు కూడా మూయిస్తున్నాడని ఉండవల్లి విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఆలోచన ఉన్నది కాబట్టే కెసిఆర్ మాటలు పట్టించుకోవటం లేదని, లేకపోతే ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలు కరువయ్యేవని చెప్పారు. ‘తలలు తీసేస్తాము, నాలుకలు కోసేస్తాము, పీకలు తెగుతాయంటున్న కెసిఆర్ అసలు ఎక్కడికి వెళుతున్నారు. తనను నమ్మిన వారిని ఎక్కడికి తీసుకుపోతున్నారు’ అని ప్రశ్నించారు. కెసిఆర్ తప్పుడు దోవలో పోతున్నారన్నారు. ‘టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును తిడతాడు. మంత్రి జానారెడ్డినీ తిడతాడు. ఏమిటది? కెసిఆర్ ఓ విచ్ఛిన్నకర శక్తి’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన సంతానం భవిష్యత్తు గురించి ఆలోచించే కెసిఆర్కు తెలంగాణ గురించి ఎలాంటి పట్టింపూ లేదన్నారు. ‘చర్చల ద్వారానే తెలంగాణ సమస్య పరిష్కారమవుతుంది. దీనికి అందరు సిద్ధపడాలి’ అన్నారు. దేశాన్ని దూషించే విధానం ఎంత మాత్రం మంచిది కాదని హితవు పలికారు. నంబర్ వన్ దుర్మార్గుడు కావద్దని ఆయన కెసిఆర్కు తనదైనశైలిలో విజ్ఞప్తి చేశారు. కేసిఆర్ మాత్రం ఆవేశంలో, ఆలోచనతో విమర్శలు చేశాడో తెలియాదు గానీ మొత్తం రాష్ట్రంలో రాజకీయ నాయకులు మద్య మాటల యుద్దం పెట్టాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రంలో ఏం జరిగిన నాకే సంబందం లేదనే ఉద్దేశంతో ఆయన మాత్రం మెదక్ జిల్లాలో ఉన్న తన ఫామ్ హౌస్ వెళ్లిపోయినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more