అక్రమాస్తుల కేసులో అరెస్టైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసు విచారణ జరుగుతుంది. జగన్ బెయిల్ కోసం చేసిన ప్రయాత్నలన్ని విఫలమయ్యాయి. జగన్ ను ఎందుకు అరెస్ట్ చేశారు అని కోర్టు జడ్జీ అడిగినట్లు తెలుస్తోంది. దానికి సీబీఐ వారు వాన్ పిక్ కేసులోనే అరెస్ట్ చేసినట్లు చెప్పటం జరిగింది. జడ్జీ అడిగిన ప్రశ్నకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో కొత్త ఆశలు రేకెత్తాయి. వైఎస్ జగన్ కు బెయిల్ వస్తుందనే ఆశ ఆ పార్టీ నాయకుల్లో పెరిగిపోయింది. అయితే ఇంకా అనేక అభియోగాలపై విచారణ జరపాల్సి ఉంది . ఆయన దాఖలు చేసిన స్టాట్యుటరీ బెయిల్ ఫిటిషన్ కు విచారణార్హత లేదు అని హైకోర్టులో సీబీఐ వాదించింది. జగన్ పై మొత్తం ఏడు అభియోగాలున్నాయి. వాటిలో ఒకటైన వాన్ పిక్ బూముల వ్యవహారంలో మాత్రమే ఆయన్ను అరెస్ట్ చేశాం. నిందితుడికి సీఆర్ పీసీ సెక్షన్ 309 కింత సీబీఐ ప్రత్యేక కోర్టు రిమాండ్ విధించింది. అసలు అరెస్టు చేయని కేసుల్లో 167 (2) సెక్షన్ కింద స్టాట్యుటరీ బెయిలు ఇవ్వాలని నిందితుడు కోరుతున్నారు. ఈ పిటిషన్ కు విచారణార్హత లేదని సీబీఐ తరపున సుప్రీం సీనియర్ లాయర్ హరెన్ సి. రావల్ కోర్టుకు విన్నవించారు. అయితే ఇప్పటి వరకు సీబీఐ నాలుగు చార్జీ షీట్లు దాఖలు చేసిందని కోర్టుకు చెప్పారు.
వాన్ పిక్ ప్రాజెక్టుకు భూముల కేటాయింపుల్లో అక్రమాలకు సంబంధించిన కేసులో మాత్రమే జగన్ ను మే 27న అరెస్టు చేశాం. తర్వాత 90 రోజుల్లోనే నాలుగో చార్జీషీటును అగస్టు 13న ప్రత్యేక కోర్టులో దాఖలు చేశాం. కాబట్టి సెక్షన్ 167(2) కింద స్టాట్యుటరీ బెయిల్ కోరే హక్కు నిందితునికి లేదని సీబీఐ వాదించింది. ఈ దశలో బెయిలు మంజూరు చేస్తే నిందితునికి ఉన్న పలుకుబడి , పార్టీని అడ్డం పెట్టుకుని సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ వాదించింది. దీంతో వాన్ పిక్ కేసులోనే జగన్ ను అరెస్ట్ చేశామని సుప్రీం కోర్టుకు చెప్పారా? చార్జీ షీటులో పేర్కొన్నారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి సీబీఐ లాయర్ అవునని సమాధానమిచ్చారు. దీన్ని న్యాయ మూరి రికార్డు చేసుకున్నారు. జడ్జీ అడిగిన ప్రశ్నలకు వైకాపా నేతల్లో కొత్త ఆనందం నింపుకుంది. వారి ఆశలు బలపడుతున్నాయి. జగన్ కు బెయిల్ వస్తుందనే ఆశతో పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more