ప్రజా సమస్యలను తీర్చాటానికి మాత్రం ఖజాన ఖాళీగా ఉందని చెప్పే సర్కారు ఇప్పుడు ఒక నటి కోసం కోటి రూపాయలు ఖర్చుచేయటం చాలా విశేషంగా ఉందని ప్రజలు అంటున్నారు. ప్రజాధనం దుర్వినియోగం చేశారంటూ ప్రజలు మండిపడుతున్నారు. పాల నురగలాంటి సొగసు. మత్తెక్కించే కళ్లు. కేక పుట్టించే జీరో సైజ్ నడుము. సిల్వర్ స్క్రీన్ పై అందచందాలు ఒలకబోసే ముద్దుగుమ్మలకు జనాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్ అందచందాలు ఎంత పొగిడినా తక్కువే. అభిమానులంతా ముద్దుగా బెబో అని పిలుచుకునే కరీనాకు జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముద్దుగుమ్మల అందచందాలకు ఫిదాకాని వారెవరుంటారు. అందుకే ప్రైవేట్ వ్యక్తులు తమ షాపు ఓపెనింగ్స్ కు సినీతారలతో గ్రాండ్ గా ఓపెనింగ్స్ చేయిస్తారు. ఇందుకు ఎంత ఖర్చు పెట్టడానికైనా వారు వెనకాడరు. తారల తళుకుబెళుకులు లేనిదే బిజెనెస్ పీపుల్ ఏదీ చేయరు. ఇప్పుడీ ఈ కల్చర్ అధికారిక కార్యక్రమాలకు కూడా సోకింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాల కోసం ఓ ప్రభుత్వం ఏకంగా బాలీవుడ్ అగ్రతారనే రంగంలోకి దింపింది. అందుకు అక్షరాల 5కోట్లు ఖర్చు పెట్టింది. అయితే ఇప్పుడీ క్రేజ్ ప్రభుత్వాలకు కూడా పాకింది. ఈ మధ్యనే ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించింది. రాజ్యోత్సవ్ పేరుతో వారం రోజుల పాటు ఎంతో రిచ్ గా వేడుకలు చేసింది.
అంతేకాదు ఈ వేడుకలకు రమణ్ సింగ్ సర్కార్.. తారల తళుకుబెళుకులు కూడా జోడించింది. ఏకంగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ కరీనా కపూర్ తో షో ఇప్పించింది. కరీనానే కాదు. ప్రముఖ సింగర్లు సోనూ నిగమ్, సునిదీ చౌహాన్, హిమేష్ రేషమియాలతో పాటలు కూడా పాడించారు. తారలతో షో ఇప్పిచేందుకు.. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అక్షరాల 5కోట్లు ఖర్చుచేసింది. అసలే టాప్ హీరోయిన్. అందులో ఫుల్ క్రేజ్ ఉన్న నటి.. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కరీనాకు భారీగానే పారితోషికం ఇచ్చింది. కేవలం 10 నిమిషాల ప్రదర్శనకు బెబోకు కోటి 40లక్షల రూపాయల పారితోషికాన్ని రమణ్ సింగ్ సర్కార్ ఇచ్చుకుంది. ఇక సింగర్లకు ఇచ్చిన పారితోషికం కూడా తక్కువేమీ కాదు. అయితే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ.. ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అక్బర్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్న లేవనెత్తారు. దీనికి ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జవాబిచ్చారు. వారోత్సవాలకు ఎంతెంత ఖర్చు చేశారన్న వివరాలు వెల్లడించడంతో.. కరీనా పారితోషికం విషయం వెలుగుచూసింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more