షర్మిలకు ఇంటి పోరు అంటే .. అత్త పోరో, లేక భర్త పోరో అని అనుకుంటే పొరపాటే. షర్మిలకు వైఎస్ కుటుంబం నుండి పోరు మొదలైనట్లు తెలుస్తోంది. తన పాద యాత్రకు ముందే ఆమె కుటుంబసభ్యుల సమక్షంలో తన మనోగతం వెల్లడించినట్లు తెలిసింది. అయితే, అకస్మాత్తుగా జగన్ చిన్నాన్న వైయస్ భాస్కరరెడ్డి కుమారుడు అవినాష్రెడ్డి పేరు తెరపైకి వచ్చారు. ఆ మేరకు కడప ఎంపి అభ్యర్థిగా పరిచయం అయ్యేందుకు బద్వేలు నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఆ విషయం తెలిసిన షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. అవినాష్ పాదయాత్ర చేస్తే తాను చేస్తున్న పాదయాత్ర నిలిపివేస్తానని ఆమె చెప్పారని అంటున్నారు. దానితో అవినాష్ పాదయాత్రను రద్దు చేసుకున్నారు. తాజా పరిణామాలు వైయస్ కుటుంబంలో కొత్త చిచ్చుకు బీజం వేశాయి. వైయస్ జగన్ పులివెందుల సీటు నుంచి శాసనసభకు పోటీ చేస్తారు కాబట్టి కడప పార్లమెంటు సీటు నుంచి తాను పోటీ చేస్తానని షర్మిల గట్టిగా చెబుతున్నారని సమాచారం. తాను పులివెందుల సీటు నుంచి పోటీ చేసి, కడప పార్లమెంటు సీటు నుంచి అవినాష్రెడ్డిని బరిలో దించాలని జగన్ భావించారని అంటారు.
అయితే, షర్మిల పాదయాత్ర ప్రారంభించే ముందు తాను కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తానని కుటుంబసభ్యులకు చెప్పారని, ఆ మేరకు వారి నుంచి గ్రీన్సిగ్నల్ రావడంతో పాదయాత్ర ప్రారంభించారని సమాచారం. వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు మాత్రమే కడప నుంచి పార్లమెంటుకు వెళ్లాలని షర్మిల వాదించడంతో వారంతా అందుకు అంగీకరించారని సమాచారం. అయితే, చాలాకాలంగా కడప లోక్సభ అభ్యర్ధిగా అవినాష్ రెడ్డి పేరు ప్రచారంలో ప్రచారంలో ఉంది. దాంతో ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా బద్వేలు నుంచి పాదయాత్ర ప్రారంభించాలని ఆయన భావించారు. ఆ మేరకు ముందు ఒక తేదీ అనుకున్నప్పటికీ, బద్వేలు ఇన్చార్జి గోవిందరెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఈనెల 23న బద్వేలు మండలం కలసపాడు నుంచి ఉదయం తొమ్మిదిన్నరకు పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు.ఆ సమాచారాన్ని జిల్లా కన్వీనర్ అంజాద్బాషా పార్టీ నేతలకు పంపించారు. అయితే, అవినాష్ పాదయాత్ర వాయిదా పడిందని, కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని, జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని మరో సందేశం పంపించారు. షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసిన కారణంగానే అది ఆగిపోయిందని అంటున్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని అవినాష్ రెడ్డి గతంలో జైలులో ఉన్న జగన్ను కోరారని తెలుస్తోంది. అయితే రెండు నెలలు ఆగమని జగన్ అప్పుడు చెప్పడంతో వెనక్కి తగ్గవలసి వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more