రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై వస్తున్న వూహాగానాకలు కాంగ్రెస్ అధిష్ఠానం తెరదించింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను మార్చాలన్న ప్రతిపాదన ఏదీ తమ ముందు లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ ఇద్దర్నీ మారుస్తారంటూ రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం వదంతేనని వ్యాఖ్యానించారు. సీఎం కిరణ్ను మారిస్తే కాంగ్రెస్కు మజ్లిస్ మద్దతు ఉపసంహరించుకోకపోవచ్చునని ఒక విలేకరి ప్రస్తావించగా.. నాయకత్వ మార్పుపై ఆయన స్పష్టత ఇచ్చారు. అసలు ముఖ్యమంత్రిని మార్చే ఆలోచనే లేదన్నారు. ఎంఐఎం అధినేత ఒవైసీతో తాను ఫోన్లో మాట్లాడానని, పార్లమెంట్ సమావేశాలకు ఆయన వచ్చినప్పుడు ముఖాముఖి చర్చిస్తానని ఆజాద్ తెలిపారు. సీఎం మతతత్వ వాదిగా వ్యవహరిస్తున్నారంటూ ఒవైసీ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు. కాంగ్రెస్ లౌకిక పార్టీ అని, పార్టీ సీఎంలు ఎవరూ మతతత్వ వాదులుగా వ్యవహరించే అవకాశం లేదని చెప్పారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ మార్పులు ఉండవంటూ ఆజాద్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవమెంత అన్న విషయం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు సోనియా తనయుడు రాహుల్ గాంధీకి కుడి భుజమైన పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్కు రాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. కాగా రాష్ట్రంలో పరిస్థితిని అధ్యయనం చేసి వచ్చే వారంలో పార్టీ అధ్యక్షురాలికి దిగ్విజయ్ నివేదిక సమర్పిస్తారని తెలిసింది. ఆ తర్వాతే తెలంగాణ ప్యాకేజీతోపాటు రాజకీయ మార్పులు ఉంటాయని సమాచారం. ఏమైనా రాష్ట్రానికి సంబంధించి తాను తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కృతనిశ్చయంతో ఉందని, ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా మార్పు తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more