కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మెగా స్టార్ చిరంజీవి తన మాటలను లండన్ లో వినిపించారు. లండన్ లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్డ్ 2012 వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడ కేంద్ర మంత్రి చిరంజీవి గారు తనదైన శైలిలో ప్రసంగించినట్లు తెలుస్తోంది. భారత్.. పర్యాటకుల స్వర్గధామమని చాటి చెప్పేందుకు ఆ శాఖా మంత్రి చిరంజీవి నూతన ప్రచారానికి నాంది పలికారు. లండన్లో జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్ట్ 2012లో జాతీయ, అంతర్జాతీయ ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 'కోరుకున్న దాన్ని మీరు చూడగలుగుతారు' అనే అర్థంలో పర్యాటకులను ఆకర్షించేందుకు చిరు ప్రయత్నం చేశారు. "గమ్యస్థానాన్ని లేదా కోరుకున్న దాన్ని పర్యాటకులు భారత్లో చూడగలరు. చారిత్రక ప్రదేశాలు, కోటలు, బీచ్లు, సరస్సులు, పర్వతాలు, సాహస ప్రదేశాలు, వన్యమృగ ప్రపంచం, సంస్కృతి, పండగలు, వైద్యం, సంపద, షాపింగ్ వంటివి ఎన్నో ఉన్నాయి. భారత్ ప్రతీ ఒక్కరికీ ఏదో ఒకటి అందిస్తుంది.పర్యాటకులకు అద్భుత ప్రదేశమని ఎందుకు చెబుతున్నామంటే.. ఎక్కడా కనిపించని క్షేత్రాలు, విశేషాలుభారత్లో ఉన్నాయి'' అని చిరంజీవి తెలిపారు. కాగా, 'వరల్డ్ ట్రావెల్ మార్ట్ -2012'లో భాగంగా రెండో రోజు భారతదేశం తరపున కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి లండన్లో విందు ఇచ్చారు. వివిధ దేశాలకు చెందిన పర్యాటక ప్రతినిధులు, ప్రధాన టూర్ ఆపరేటర్లు దీనికి హాజరయ్యారు. పలు దేశాల పర్యాటక రంగ ప్రతినిధులతో సమావేశమైన చిరంజీవి వారికి భారత దేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి వివరించారు. విదేశీ పర్యాటకుల కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను వివరించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more