‘నే బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ పాటతో ఓవర్ నైట్ స్టార్గా మారిపోయిన సాయిశ్రియ-అశోక్ జంట మీకు గుర్తుందా? అప్పగింతల సమయంలో ఆ పాటకు భర్త ముందు డ్యాన్స్ చేసిన నవ వధువు వీడియో సోషల్ మీడియాకెక్కి అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. ఆ తర్వాత ‘బుల్లెట్ బండి’ ఒరిజినల్ సాంగ్కు మరింత క్రేజ్ వచ్చి లక్షలాది వ్యూస్ లభించాయి. ఏడాది క్రితం ఈ ఘటన జరిగింది. ఇక ఆ పాటతో రాత్రికి రాత్రే పాప్యులర్ అయిపోయిన పెళ్లికొడుకు ఆకుల అశోక్. ఈ అశోక్ పెళ్లి ఎంత ఘనంగా జరిగినా.. పెళ్లికూతురు సాయిశ్రియ తన భర్తతో కలసి వేసిన పాటతో యావత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైయ్యారు ఈ కొత్తజంట.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో సూపర్ వైజర్గా పనిచేస్తున్నాడు. భార్య సాయిశ్రియ విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. అయితే యంగ్ జనరేషన్ కు చెంది.. పాటతో పాపులర్ అయిన అశోక్ టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తూ.. తన యుక్త వయస్సులోని అలోచనలకు అనుగూణంగా లంచాలను వ్యతిరేకించడం చేసేందుకు బదులు.. ఆయనే స్వతహాగా లంచాన్ని తీసుకోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెళ్లితో వచ్చిన పాపులారిటీని లంచం తీసుకోవడంతో లంచావతారంగా మారిపోయింది.
యువభావాలు కలిగిన ఉద్యోగిగా తనకంటూ ఓ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న అశోక్.. తన చేజేతులా తన పవువును తానే తీసుకున్నాడు. ఓ పని చేయడానికి రూ.30 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఇంటి నిర్మాణం విషయంలో తన వద్దకు వచ్చిన దేవేందర్రెడ్డి అనే వ్యక్తి నుంచి అశోక్ లంచం డిమాండ్ చేశాడు. అతడు నిన్న లంచం సమర్పించుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత కార్యాలయంతోపాటు అశోక్ నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. సత్కార్యములు చేస్తూ కీర్తి గోచరిస్తుంది.. లేకపోతే అపకీర్తి చుట్టుముడుతుందనడానికి ఈ సంఘటనే ఉదాహరణ.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more