దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు డివైడర్ నే తమ అవాసంగా చేసుకుని ఆదమరచి నిద్రిస్తున్నవారిపై నుంచి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని సీమాపురి డీటీసీ డిపో వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ లారీ అర్థరాత్రి వేళ అడ్డూ అదుపు లేకుండా దూసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకువచ్చిన ట్రక్కు డ్రైవర్ ట్రాపిక్ సిగ్నల్ ను పట్టించుకోకపోవడం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని సీమాపూరి ప్రాంతంలోని డీటీసీ డిపో వద్ద కొందరు డివైడర్ పై పడుకున్నారు. అయితే రాత్రి దాదాపు ఒంటిగంట సమయంలో రయ్య్ మంటూ దూసుకువచ్చిన ఓ ట్రక్కు.. ట్రాఫిక్ సిగ్నల్ ను పట్టించుకోలేదు. ఈ క్రమంలో సిగ్నల్ పడటంతో అటుగా వెళ్తున్న వాహనాలను తప్పించే క్రమంలో అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. అయితే రోడ్డు డివైడర్పై నిద్రిస్తున్నవారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించగా మరో ఇద్దరు మరణించారు.
బుధవారం తెల్లవారుజామున 1.51 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. డివైడర్ పై నిద్రిస్తున్న నలుగురిపైకి దూసుకెళ్లడంతో పాటు రోడ్డు దాటుతున్న మరో ఇద్దరు గాయపడ్డారు. ట్రక్కును కనుక్కునేందుకు పోలీసుల ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు. మరణించిన నలుగురిని కరీం(52), చోట్టే ఖాన్లు(25), షా ఆలం(38), రాహుల్ (45)గా గుర్తించారు. గాయడిన వారిలో 16 ఏళ్ల మనీష్, 30 ఏళ్ల ప్రదీప్ ఉన్నారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడైన ట్రక్కు డ్రైవర్ కోసం వేట సాగిస్తున్నారు. ఘటనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా లారీని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Delhi | An unknown speeding truck mowed down 4 people & injured 2 persons who were sleeping on the road divider, while crossing DTC Depot Redlight in Seemapuri: Police https://t.co/71EgsKQFo6 pic.twitter.com/iRT2HlodJU
— ANI (@ANI) September 21, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more