పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఐదు ప్రదేశాల్లో దాడులు చేపట్టింది. ఈ స్కాంలో అరెస్టయిన మంత్రి పార్ధఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి చెందిన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బెల్గోరియా నగరంలోని రథ్ తల ప్రాంతంలోని ఫ్లాట్కు చేరుకున్న ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో అమెకు చెందిన రెండో ఫ్లాట్ నుంచి అధికారులు ఏకంగా రూ. 15 కోట్లకు పైగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంకా నగదు, బంగారాన్ని అధికారులు లెక్కిస్తున్నారు.
ఈ ప్లాట్ కు చేరుకున్న అధికారులకు అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో బ్యాంకు అధికారులను రంగంలోకి దింపిన అధికారులు.. ఏకంగా ఐదు కౌంటింగ్ మిషన్ల సాయంతో వాటిని లెక్కిస్తున్నారు. కాగా ఇంకా నోట్ల కట్టల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఇప్పటి వరకు ఏకంగా రూ. 15 కోట్ల విలువైన నగదు, బంగారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అర్పిత ముఖర్జీకి చెందిన కోల్కతా ఫ్లాట్లో గతవారం ఈడీ అధికారులు రూ 22 కోట్ల నగదు, 20కి పైగా మొబైల్ పోన్లు స్వాధీనం చేసుకున్నారు.
రిక్రూట్మెంట్ స్కాంలో అర్పిత ముఖర్జీని ఈడీ అధికారులు ప్రశ్నించిన మర్నాడే తాజా దాడులు జరగడం గమనార్హం. అర్పిత ముఖర్జీని ఆగస్ట్ 3వరకూ ఈడీ కస్టడీని కోర్టు అనుమతించింది. ఇక ఇదే కేసులో మంత్రి పార్ధ ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, తన ఇంటితో పాటు మరో మహిళ ఇంటిని కూడా మినీ బ్యాంక్లా మంత్రి పార్ధా వాడుకున్నట్లు తెలిపింది. మరో మహిళ కూడా మంత్రి పార్ధాకు సన్నిహితురాలని అర్పిత వెల్లడించింది.
తన ఇంటిలోని రూమ్లో ఎంత సొమ్ము ఉందో మంత్రి ఎప్పుడూ బయటకు చెప్పలేదన్నది. ఓ బెంగాలీ నటుడు తనను మంత్రి పార్ధాకు పరిచయం చేయించాడని, 2016 నుంచి ఇద్దరి మధ్య పరిచయం ఉన్నట్లు ఆమె చెప్పారు. ట్రాన్స్ఫర్లు, కాలేజీ గుర్తింపు కోసం ఇచ్చిన లంచాలదే ఆ డబ్బు మొత్తం అని ఆమె తెలిపింది. కానీ ఆ డబ్బును మంత్రి ఎప్పుడూ తీసుకురాలేదని, అతని మనుషులు మాత్రమే తెచ్చేవారని ఆమె చెప్పింది.. తాజాగా మరో 15 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more