మిలిటరీ రిక్రూట్ మెంట్ స్కీమ్ అగ్నిపథ్ కు సంబంధించి దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, అందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాము ఎట్టి పరిస్థితుల్లో అగ్నిపథ్ పథకం నుంచి వెనక్కు తగ్గబోమని కేంద్రప్రభుత్వంతో పాటు జాతీయ భద్రాతా సలహాదారు కూడా తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. అయితే దేశ రక్షణ వ్యవస్థను కూడా చిన్నాభిన్నం చేయడం సముచితం కాదని, అగ్నిపథ్ పథకం రక్షణా వ్యవస్థను బలహీనం చేస్తోందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేత రాహుల్ గాంధీ పథకం ప్రకటించిన నాటి నుంచి చెబుతూనే ఉన్నారు.
ఇక తాజాగా ఇవాళ ఆయన మరో అడుగు ముందేకేసీ నూతన సాగు చట్టాలను కూడా వెనక్కు తీసుకోబోమని కేంద్రం, కేంద్రమంత్రులు స్పష్టం చేసిన విషయం తెలిసిందేనని, అయితే రైతుల ఆందోళనలు, నిరసనలు జోరందుకోవడంతో.. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపసంహరించుకున్నారని ఆయన చెప్పారు. అదే విధంగా అగ్నిపథ్ పథకాన్ని కూడా కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ వెనక్కు తీసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే రైతుల మాదిరిగానే శాంతియుత అందోళనలతో కేంద్రం దిగివస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తపర్చారు. ఇందులో భాగంగా తమ పార్టీ కూడా ఈ నెల దేశవ్యాప్త అందోళనకు పిలుపునిచ్చిందని తెలిపారు.
అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా ఈనెల 27న దేశవ్యాప్తంగా సత్యాగ్రహం నిర్వహిస్తుందని రాహుల్ గాంధీ ప్రకటించిన తరుణంలో ఆ నిరసన వివరాలను పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ వివరించారు. సత్యాగ్రహంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిరసనలు చేపడతారని చెప్పారు. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా తమ పోరాటం నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఇక అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అగ్నిపథ్ను తక్షణమే వెనక్కితీసుకోవాలని మరోసారి డిమాండ్ చేశారు.
తాత్కాలిక సైనిక నియామక పధకంతో కేంద్రం ఆర్మీని నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. కాషాయ పాలకులు వన్ ర్యాంక్..వన్ పెన్షన్ గురించి మాట్లాడతరాని, వారు ఇప్పుడు నో ర్యాంక్..నో పెన్షన్తో ముందుకొచ్చారని ఎద్దేవా చేశారు. చైనా మన సరిహద్దుల్లో కూర్చుంటే మనం సైన్యాన్ని బలహీనపరిచే చర్యలు చేపడుతున్నామని, ఇది దేశ ప్రయోజనాలకు హానికరమని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయవాదులమని చెప్పుకుంటూ కాషాయ పాలకులు సైన్యాన్ని బలహీనపరుస్తున్నారని అన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన మాదిరిగానే అగ్నిపథ్ను కూడా రద్దుచేయాలని మోదీ సర్కార్ను రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 08 | ఒక వ్యక్తి అనూహ్యంగా రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. అతని బ్యాంకు ఖాతాలోకి ఒక్కసారిగా కోటాను కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. ఈ డబ్బు ఎలా వచ్చిందో.? ఎవరు పంపించారో తెలియదు.. వారం క్రితం... Read more
Aug 08 | ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోగల సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌజింగ్ సొసైటీలో ఓ మహిళతో అనుచితంగా వ్యవహరించిన స్థానిక బీజేపీ కార్యకర్త.. పోలీసుల రంగప్రవేశంలో పరార్ అయ్యాడు. అతని ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు... Read more
Aug 08 | ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్ల ప్రకటించారు.... Read more
Aug 08 | కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పవిత్రోత్సవాలలో భాగంగా క్రితం... Read more
Aug 06 | ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్ ధన్ఖడ్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5... Read more