అగ్రరాజ్యంలో నానాటికీ పెరుగుతున్న తుపాకీ సంస్కృతి స్వదేశీయులతో పాటు మన దేశీయులను కూడా బలి తీసుకుంటున్నాయి. అగ్రరాజ్యంలోని తుపాకీ సంస్కృతిపై అక్కడి పాలకులు విచారం వ్యక్తం చేయడం మినహా.. ప్రజలు ప్రాణాలు పోతున్నాయని భావించి చట్టాల్లో సంస్కరణలను తీసుకురావడం మాత్రం చేయడం లేదు. ఫలితంగా అగ్రరాజ్య అభివృద్ది కోసం అహర్నిషలు కష్టపడి పనిచేస్తున్న అక్కడి ప్రవాస భారతీయులు కూడా వీటికి బలవుతున్నారు. ఇక మేరీల్యాండ్ లో పక్షం రోజలు క్రితం స్మిత్స్ బర్గ్ లో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించిన విషాధాన్ని ఆ ప్రాంతవాసులు మార్చిపోకముందే మరోమారు కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
తాజాగా జరిగిన కాల్పుల్లో నల్గొండకు చెందిన యువ పర్యావరణ ఇంజనీరు మృతి చెందాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నక్కా సాయిచరణ్ (26) దుండగుడి కాల్పుల్లో మృతి చెందాడు. గత రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్లిన ఆయన.. అక్కడి సిన్సినాటి యూనివర్శిటీ లో ఎంఎస్ పూర్తి చేసి.. అరు నెలల క్రితమే సాయిచరణ్ అక్కడి ఓ కంపెనీలో ఇంజనీరుగా ఉద్యోగంలో చేరాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు విమానాశ్రయం వద్ద దింపి.. తిరిగి ఇంటికి చేరుకుంటున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ఇది వరుసగా జరుగుతున్న కాల్పుల్లో భాగమా.? లేక విద్వేష నేరమా.? అన్నది ఇంకా తెలియరాలేదు.
సాయిచరణ్ పై కాల్పులకు పాల్పడింది ఓ నల్లజాతీయుడిగా తేలింది. విమానాశ్రయం నుంచి తిరిగివస్తున్న ఆయనపై సాయంత్రం సమయంలో కాల్పులకు తెగబడ్డాడని సమాచారం. ఆదివారం సాయంత్రం కాల్పుల ఘటన చోటుచేసుకోగా.. అతని స్నేహితులు సాయిచరణ్ తల్లిదండ్రులకు సోమవారం సమాచారం అందించారు. ఎన్నో ఆశలతో అగ్రరాజ్యానికి వెళ్లిన తమ బిడ్డ.. అనుకోని ఘటనలో ప్రాణాలు కోల్పోయాడని తెలియడంతో సాయిచరణ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో నల్గోండలోనూ స్థానికంగా విషాదం అలుముకుంది.
ఈ క్రమంలో శోకాతప్తుడైన సాయి చరణ్ తండ్రి నర్సింహా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సాయిచరణ్ ఉదయం జరిగిన కాల్పుల్లో మృతి చెందగా.. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో సమాచారం వచ్చింది. సాయిచరణ్ ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లాడు. సిన్సినాటి యూనివర్శిటీ లో ఎంఎస్ పూర్తి చేశాడు. ఆరు నెలలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితమే కారు కొనుగోలు చేశాడు. నవంబర్లో స్వదేశానికి వస్తానని అన్నాడు. చివరిసారిగా శుక్రవారం మాతో మాట్లాడాడు. బ్యాంకు అకౌంట్ డిటైల్స్ అడిగితే పంపించాం’’ అని తెలిపారు. సాయి చరణ్ మృతదేహం త్వరగా వచ్చేలా చూడాలని ఆయన విదేశాంగ శాఖామంత్రిని కోరారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more