హైదరాబాద్లోని ఆమ్నేషియా పబ్ సమీపంలో బాలికను అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో మరో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మొత్తం ఐదుగురుని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అందులో నలుగురు నిందితులు ఉన్నారు. బీజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఈ ఘటనకు సంబంధించి ఇందులో టీఆర్ఎస్, ఎంఐఎంకు సంబంధించిన నేతల పిల్లలు వున్నారనే అరోపించడం.. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా లీక్ చేయడంతో ఈ లైంగిక ఘటన రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది.
అమ్నేషియా పబ్ కేసులో తగు ఆధారాలు లేవని పోలీసులు గత శనివారం చెప్పడంతో రఘునందన్ రావు అదే రోజు సాయంత్రం పలు ఆధారాలను విడుదల చేశారు. అదివారం రోజున కూడా పలు ఆధారాలను విడుదల ప్రక్రియ కొనసాగడంతో పోలీసుల్లోనూ కలవరం రేపింది. ఎమ్మెల్యే రఘునందన్ రావు బాధితురాలి ఫోటోలు మీడియాకు విడుదల చేసిన మరుసటి రోజు అనగా, ఆదివారం మరికొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. బెంజ్ కారులో నలుగురు యువకులతో కలిసి బాధితురాలు సన్నిహితంగా ఉన్న ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
బెంజ్ కారులో ఉన్న ఎమ్మెల్యే కొడుకు, కారులో సదరు అమ్మాయితో అసభ్యంగా వ్యవహరిస్తున్న ఫొటోలను రఘునందన్ రావు శనివారం విడుదల చేయగా, అదివారం అమెకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో బాలిక వీడియోలను నెట్టింట్లో పోస్టు చేసిన అవి వైరల్ కావడానికి కారణమైన సుబాష్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతను కూడా పాతబస్తీకి చెందిన వ్యక్తే. దీంతో ఈ కేసులో మొత్తం ఇప్పటివరకు ఐదుగురిని అదుపులోకి తీసుకోగా, వారిలో నలుగురు నిందితులు.
కాగా, బాలికపై సామూహిక లైంగిక దాడి బెంజ్ కారులో జరిగినట్లు వీడియోల్లో కనిపించగా, ఇన్నోవా కారులో బాధితురాలిపై అత్యాచారం జరిగినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. అదే సమయంలో అటు బెంజ్ కారులోనూ బాధితురాలిపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించారు. ఇక ఈ కేసులో మరో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో సాదుద్దీన్ మాలిక్తో పాటు ముగ్గురు జువైనల్స్ అరెస్టయ్యారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ఉమేర్ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
బెంజ్కారులో మహిళల పెద్ద వెంట్రుకలు, షటిల్ కాక్, టేప్, శానిటైజర్లు, మాస్కులు, మహిళకు సంబంధించిన చెప్పులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారులో లైంగిక దాడికి పాల్పడినప్పుడు సీట్లపై ఏర్పడ్డ మరకలు, పలు నమూనాలు సేకరించారు. పొడవాటి వెంట్రుకలు, సీట్లపై చేతి వేలి ముద్రలు, డోర్లపై ఉన్న వేలిముద్రలను తీసుకున్నారు. కాగా, నిందితుల్లో ఒకరు మినహా మిగతావారిందరిదీ రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే. ఒక నిందితుడు ఆటో డ్రైవర్ కొడుకు కాగా, మరో నిందితుడు ప్రభుత్వసంస్థ చైర్మన్ కొడుకు, ఇంకో నిందితుడు సంగారెడ్డికి చెందిన ప్రజాప్రతినిధి కొడుకు, పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్ మాలిక్కు కుటుంబానికీ రాజకీయ సంబంధాలు ఉన్నా యి. ఇక తప్పించుకు తిరుగుతున్న ఉమేర్ఖాన్.. బషీర్బాగ్లోని ఒక పాత థియేటర్ యజమాని మనుమడు. వీళ్లది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more