ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికీ తెలియదు అన్న నానుడి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో ఎవరూ సామాన్యంగా పెట్టుకోరు. ఎందుకంటే ఓ పట్టాణ ఈ ప్రభుత్వ సంస్థలు విషయాన్ని వదిలిపెట్టవని, దీంతో తమ అమూల్యమైన సమయం కాస్తా వృధ్దా అవుతుందని వారు భావిస్తుంటారు. కానీ కొందరు మాత్రం తెగినా పర్వాలేదు.. లాగి చూద్దాం.. ఎదుటి వారు బలవందులయితేనే తమ బలం కూడా తెలుస్తుందని సవాల్ కు సిద్దంగా ఉంటారు. ఇలాంటి వారి జాబితాలోనే రాజస్థాన్లోని కోటాకు చెందిన సుజీత్స్వామి అనే ఇంజినీర్ కూడా స్థానం దక్కించుకున్నారు. ఔనా.. ఈ ఇంజనీరు ఎలాంటి పోరు చేశారన్న పూర్తి వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే..
రైల్వే శాఖ నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను వెనక్కి రప్పించుకోవడంతో పాటు ఏకంగా తనలా కొన్ని లక్షల మందికి కూడా వారి అమూల్యమైన డబ్బును వారికి తిరిగి ఇప్పించడానికి కారణబూతుడయ్యాడు. ఏంటీ రూ.35 కోసం పోరాటమా.? ఈ చిన్న మొత్తం కోసం ఎవరైనా పోరాటం చేస్తారా.? అంటే అతని ఒక్కడి నుంచి రూ. 35 కాదు.. ఏకంగా 2.98 లక్షల మందికి రూ.35 తిరిగి వెనక్కు ఇప్పించాడు. అంటే దాదాపుగా 2.43 కోట్ల రూపాయలను రైలు ప్రయాణికులకు తిరిగి ఇప్పించడానికి అతను చేసిన పోరాటమే కారణమైందంటే నమ్మశక్యంగా లేదా.? ఇప్పుడ చెప్పండీ అయన చేసిన పోరాటం రూ. 35 కోసమేనా.. లేక రూ.2.43 కోట్ల కోసమా.? ఇక పోరాట వివరాల్లోకి వెళ్తే..
రైల్వేతో ఐదేళ్లు పోరాడి తనకు రావాల్సిన రూ. 35 సాధించుకున్నారు. అంతేకాదు, ఆయన పోరాటంతో 2.98 లక్షల మందికి లబ్ధి చేకూరడం గమనార్హం. రాజస్థాన్లోని కోటాకు చెందిన సుజీత్స్వామి ఇంజినీరుగా విధులు నిర్వహిస్తున్నాడు. 2 జులై 2017న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఐఆర్సీటీసీ ద్వారా ఏప్రిల్లో టికెట్ బుక్ చేసుకుని టికెట్ ధర రూ. 765 చెల్లించారు. ఆ తర్వాత ఆయన తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవడంతో రూ. 100 మినహాయించుకుని మిగతా మొత్తాన్ని ఐఆర్సీటీసీ రిఫండ్ చేసింది. నిజానికి కేన్సిలేషన్ రుసుము రూ. 65 మాత్రమే మినహాయించుకోవాల్సి ఉండగా అదనంగా రూ. 35 జీఎస్టీ కింద వసూలు చేయడంపై స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే అవి జీఎస్టీ చార్జీల కింద మినహాయించుకున్నట్లుగా అధికారులు నుంచి వచ్చిన వివరణతో తాను సంతృప్తి చెందలేదు. తాను జీఎస్టీ అమల్లోకి రాకముందే టికెట్ బుక్ చేసుకున్నానని, అలాంటప్పుడు తన నుంచి జీఎస్టీ ఎలా వసూలు చేస్తారని రైల్వేపై పోరాటానికి దిగారు. ఇందులో భాగంగా రైల్వేకు, ఐఆర్సీటీసీకి, ఆర్థిక శాఖకు, సేవా పన్నుల శాఖకు ఆర్టీఐ కింద 50 అర్జీలు పెట్టారు. అయితే ఆయన పోరాటంలో న్యాయముందని గ్రహించిన రైల్వేశాఖ దిగొచ్చించి. జీఎస్టీ పేరుతో అదనంగా వసూలు చేసిన రూ. 35ను తిరిగి వెనక్కి ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే, ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది.
రూ. 35 చెల్లించాల్సిన రైల్వే 1 మే 2019న ఆయన బ్యాంకు ఖాతాలో రూ. 33 మాత్రమే జమ చేసింది. దీంతో మిగిలిన రెండు రూపాయల కోసం స్వామి మరో మూడేళ్లు పోరాడి విజయం సాధించారు. ఆ రెండు రూపాయలను కూడా రైల్వే ఆయన ఖాతాలో జమచేసింది. అంతేకాదు, ఆయన పోరాటంతో మరో 2.98 లక్షల మంది కూడా లబ్ధిపొందారు. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు టికెట్లు బుక్ చేసుకుని కేన్సిల్ చేసుకున్న 2.98 లక్షల మందికి కూడా రూ. 35 వెనక్కి ఇచ్చేందుకు రెడీ అయింది. ఇందుకోసం మొత్తంగా రూ. 2.43 కోట్లను రైల్వే రీఫండ్ చేయనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more