పద్నాలుగేళ్ల మైనర్ బాలుడిని ముద్దు పెట్టుకోవడంతో పాటు అతని రహస్యబాగాలను తాకడం అసహజ లైంగిక చర్య (అన్నాచురల్ సెక్సువల్ అసల్ట్) కిందకు రాదని బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. 14 ఏళ్ల బాలుడిని ముద్దు పెట్టుకోవడంతోపాటు ప్రైవేటు పార్టులు కూడా తడమాడంటూ ఓ వ్యక్తిపై నమోదైన కేసులో బాంబే హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. బాలుడి పెదవులపై ముద్దులు పెట్టడం, తడమడం వంటి వాటిని అసహజ లైంగిక నేరంగా పరిగణించలేమని స్పష్టం చేస్తూ నిందితుడికి బెయిలు మంజూరు చేసింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన ఓ వ్యక్తి బీరువాలో ఉంచిన డబ్బులు తరచూ మాయం అవుతుండడంతో తన 14 ఏళ్ల కుమారుడిని అనుమానించాడు. డబ్బులు ఏమవుతున్నాయని గద్దించగానే బాలుడు నిజం ఒప్పుకున్నాడు. ఆ డబ్బులు తానే తీస్తున్నానని, వాటితో ఆన్లైన్ గేమ్స్ ఓలా పార్ట్ రీచార్జ్ చేయించుకుంటున్నట్టు చెప్పాడు. ఈ క్రమంలో మరో విషయాన్ని కూడా బాలుడు బయటపెట్టాడు. తాను రీచార్జ్ కోసం షాపునకు వెళ్లినప్పుడు దాని యజమాని తనను దగ్గరకు తీసుకుని ముద్దులు పెడుతున్నాడని, ప్రైవేటు పార్టులు తడుముతున్నాడని చెప్పాడు. దీంతో బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ 377 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఏడాదిగా జైలులో ఉన్న నిందితుడు ఇటీవల బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విచారించిన న్యాయమూర్తి జస్టిస్ అనూజ ప్రభు దేశాయ్.. నిందితుడు బాలుడి పెదాలపై ముద్దులు పెట్టాడని, తాకాడని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారని, అయితే ఈ అభియోగాలు సెక్షన్ 377 కిందికి రావని తేల్చిచెబుతూ నిందితుడికి బెయిలు మంజూరు చేశారు. నిజానికి సెక్షన్ 377 కింద కేసు నమోదైతే బెయిలు రావడం కష్టమే కాదు.. జీవిత శిక్ష కూడా పడే అవకాశం ఉంది. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్టు వైద్య పరీక్షల్లో ఆధారాల్లేవని జస్టిస్ అనూజ పేర్కొం:టూ బెయిల్ మంజూరు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more