కోవిడ్ టీకా వేసుకోవాలని దేశంలోని ప్రజలెవరినీ ఒత్తిడి చేయవద్దు అని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పేర్కొన్నది. దేశంలో కరోనా రెండో దశకు ముందు అందుబాటులోకి వచ్చిన కోవిడ్ వాక్సీన్ వేసుకోవడంపై దేశప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం.. ఈ నేపథ్యంలో రెండో దశలో కరోనా తీవ్ర లక్షణాలతో విజృంభించడం.. ఆక్సిజన్ అందక అనేకులు అసువులు బాసారు. ఈ తరుణంలో కోవిడ్ టీకాలు తీసుకునేందుకు దేశప్రజలు పోటీపడ్డారు. దీంతో డిమాండ్ కు తగు సంఖ్యలో వాక్సీన్ కూడా అందుబాటులోకి లేకపోవడంతో ఏకంగా కొన్ని రోజుల పాటు వాక్సీన్ ఇవ్వడం కూడా నిలిపివేశారు.
ఆ తరువాత దేశంలోని ప్రతీ ఒక్కరు వాక్సీన్ తీసుకోవలన్న అదేశాలతో హర్ గర్ దస్తక్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది కేంద్రం. దీంతో దేశప్రజల్లో దాదాపుగా అందరూ టీకాలు తీసుకున్నారు. అయితే కొందరు మాత్రం వాక్సీన్ కు భయపడి చెట్లు ఎక్కడం, నదిలోకి వెళ్లడం లాంటి చర్యలు చేపట్టారు. ఇలాంటి వారికి ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ఊరట కల్పించింది. ఇకపై వాక్సీన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఎవరినీ ఒత్తిని చేయవద్దని కేంద్ర కుటుంబ అరోగ్యశాఖ అధికారులను అదేశించింది. ప్రస్తుతం జరుగుతున్న వ్యాక్సినేషన్ విధానం అసంబద్ధంగా ఉందని అనలేమని సుప్రీం తెలిపింది.
కోవిడ్19 వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి కేంద్రం డేటాను రిలీజ్ చేయాలని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్నది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షలను కోర్టు తప్పుపట్టింది. వ్యాక్సిన్ వేసుకోని వారిని పబ్లిక్ ప్రదేశాలకు రానివ్వకపోవడం సరిగా లేదని కోర్టు తెలిపింది. అలాంటి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వాలు వెంటనే వాటిని ఎత్తివేయాలని ఇవాళ సుప్రీంకోర్టు కోరింది. వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించి, ప్రజా సంక్షేమం కోసం కొన్ని షరతులను అమలు చేయాలని కోర్టు తన తీర్పులో చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more