ఉక్రెయిన్లో హృదయవిదారకర దృశ్యాలు కలిచివేస్తున్నాయి. రష్యా దాడితో ఆ దేశం అతలాకుతలం అవుతోంది. కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఎక్కడ తమ పిల్లలకు దూరం అవుతామో అన్నటెన్షన్ పట్టుకున్నది. తమను చంపినా.. పిల్లలు బ్రతికితే చాలన్న ఆలోచనలో తల్లులున్నారు. ఇక అక్కడి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పిల్లల వెన్ను భాగంలో వివరాలు రాసిన ఫోటోలు ఇప్పుడు అక్కడి భయానక పరిస్థితికి నిదర్శంగా మారాయి. ఓ జర్నలిస్టు ఆ ఫోటోలను తన ట్వీట్లో పెట్టారు. వాస్తవానికి ఓ తల్లి తన పిల్లలపై ఆ ఫ్యామిలీ వివరాలు రాసింది. ఇన్స్టాలో ఆమె పెట్టిన పోస్టును తర్జుమా చేసి ఓ జర్నలిస్టు ట్వీట్ చేశారు.
ఓ అమ్మాయిపై ఆ పాప పేరును, టెలిఫోన్ నెంబర్ను రాసింది తల్లి. కూతురు వీరా బ్రతికితే, ఎవరైనా ఆమెను శరణార్థిగా స్వాగతిస్తారన్న ఉద్దేశంతో ఇలా ఆమె రాశారు. చిన్నారిపై వివరాలు రాసిన ఫోటోపై ట్విట్టర్లో నెటిజెన్లు స్పందిస్తున్నారు. గుండెను కలిచివేస్తోందని, మాటలను రావడం లేదని ఓ యూజర్ కామెంట్ చేశాడు. రష్యా దళాలు ప్రాణాలతో బయటపడేందుకు పిల్లల్ని వాడుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నొవియి బికి పట్టణంలో యుద్ధ ట్యాంకుల ముందు పిల్లలతో నిండిని బస్సులను నిలిపినట్లు ఓ రిపోర్ట్లో తేలింది.
Ukrainian mothers are writing their family contacts on the bodies of their children in case they get killed and the child survives. And Europe is still discussing gas. pic.twitter.com/sK26wnBOWj
— Anastasiia Lapatina (@lapatina_) April 4, 2022
ఉక్రెయిన్ పై నెలరోజలుకు పైగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా యుద్ధా నేరాలకు పాల్పడుతోంది. అయితే ఉక్రెయిన్ రాజధాని కైవ్ ప్రాంతంలో రష్యా దళాల చేతిలో ఒక వ్యక్తి చనిపోయాడు. అయితే అతని పెంపుడు కుక్క అతనిని వదిలి వెళ్లేందుకు నిరాకరించింది. అతని మృతదేహం పక్కనే దీనంగా కూర్చొని ఉన్న ఉద్వేగభరితమైన ఫోటోని తూర్పు యూరోపియన్ నెక్స్టా మీడియా పోస్ట్ చేసింది. ఈ సంఘటన 1930లలో మరణించిన తర్వాత తొమ్మిదేళ్లపాటు తన యజమాని కోసం ఎదురుచూసిన జపనీస్ కుక్క హచికో కథను గుర్తుచేస్తోంది. రష్యా దాడులు కారణంగా ఉక్రెయిన్లో వేలాది మంది పౌరులు నిరాశ్రయులయ్యారు. మరోవైపు బూచో నగరం శవాల దిబ్బగా మారిపోయింది.
The dog does not leave its owner, who was killed by the #Russian invaders. #Kyiv region. pic.twitter.com/dnVV1X7XLG
— NEXTA (@nexta_tv) April 4, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more