కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట లభించింది. ఆయన కోడలు సారిక తన ముగ్గురు పిల్లలతో పాటుగా ఆయన ఇంటిలోనే సజీవ దహనం అయిన కేసులో రాజయ్యపై పోలీసులు అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఆయన కుమారుడు అనిల్, భార్య మాధవి కూడా ఈ కసులో నిందితులుగా చేర్చారు పోలీసులు. సరిగ్గా రాష్ట్రంలో ఉపఎన్నికలకు ముందు జరిగిన ఈ పరిణామంతో రాజయ్య తీవ్ర మనస్తాపం చెంది ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు.
అంతేకాదు ఈఘటన నేపథ్యంలో రాజయ్య రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. 2015లో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను కలకలమే రేపింది. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన హైదరాబాద్లోని ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాజయ్యతో పాటు ఆయన కుమారుడు అనీల్, భార్య మాధవి నిర్దోషులేనని కోర్టు తీర్పు చెప్పింది. కాగా కోర్టు తీర్పుపై రాజయ్య కానీ, ఆయన కుటుంబసభ్యులు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా, రాజయ్యకు ఆయన మనవళ్లు, మనవరాళ్లు అంటే అమితమైన ప్రేమ. దాంతో ఆయన అప్పట్నించీ మానసికంగా కుంగిపోయారని ఆయన సన్నిహుతులు పేర్కోన్నారు.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 2015 నవంబర్ 4 తెల్లవారుజామున వరంగల్లోని రాజయ్య ఇంటిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రాజయ్య కోడలు సారికతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు అభినవ్(7), ఆయోన్(3), శ్రీయోన్(3) లు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సారిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రాజయ్య సహా ఆయన భార్యను, కొడుకును అదుపులోకి తీసుకొని 498ఎ, 306, 176 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఈ కేసు విచారణను నిర్వహించిన నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more