ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దేశంలోనే అత్యధిక స్థానాలు కలిగిన రాష్ట్రంగా పేరొందిన యూపీలో విజయం వరించిన పార్టీకి.. కేంద్రంలోనూ చక్రం తిప్పే అవకాశం కలగడమే అందుకు కారణం. దీంతో దేశంతో పాటు ప్రపంచ దృష్టి కూడా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై పడింది. ఇక ఇలాంటి రాష్ట్రంలో తమ ప్రత్యర్థి పార్టీలపై ఉనికి చాటుకుని అధిపత్యం చెలాయించడంతో పాటు అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ఇప్పటికే ప్రధాన పార్టీలు కుస్తీపడుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలు రాష్ట్ర ప్రజలపై వరాలను కురిపిస్తున్నాయి. ఉచిత పథకాలు, ఉచిత హామీలను ఇస్తూ ప్రజలకు ఉచిత ఎన్నికల వాగ్ధానాలను కురిపిస్తున్నాయి.
ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం ఉచిత ఎన్నికల వాగ్ధానాలపై కళ్లెం వేసేలా.. కేంద్ర ఎన్నికల సంఘం సహా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఓ పిటీషన్ విచారణ సందర్భంగా కీలకవ్యాఖ్యలు చేసినా.. తమకు గెలుపే ముఖ్యమని భావిస్తున్న పార్టీలు మాత్రం ఎన్నికలవాగ్ధానాలకే మొగ్గుచూపుతూ తమ మానిఫెస్టోలను సైతం విడుదలచేశాయి. మళ్లీ అధికారం ఇస్తే ‘లవ్ జిహాద్’కు పాల్పడిన వారికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని, లక్ష రూపాయల జరిమానా విధిస్తామని చెబుతూ యూపీ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ‘లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర -2022’ పేరిట రూపొందించిన ఈ మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిన్న విడుదల చేశారు.
కుటుంబానికో ఉద్యోగం, వచ్చే ఐదేళ్లపాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్, చెరుకు రైతుకు రెండు వారాల్లో బిల్లులు, ఆలస్యమైతే మిల్లుల యజమానుల నుంచి వడ్డీ వసూలు, ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కూటర్లు, విద్యార్థులకు రెండు కోట్ల ట్యాబ్లు, స్మార్ట్ఫోన్లు ఉచితంగా అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. పూర్తి వసతులతో జిల్లాకో ఆసుపత్రి నిర్మించడంతోపాటు హెలికాప్టర్ ప్రమాదంలో ఇటీవల మరణించిన జనరల్ బిపిన్ రావత్ పేరిట బుందేల్ఖండ్లో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. బీజేపీ మేనిఫెస్టో అలా విడుదల చేసిందో లేదో.. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా మేనిఫెస్టో విడుదల చేశారు.
బీజేపీ మేనిఫెస్టోకు ఏమాత్రం తగ్గకుండా హామీల వరద పారించారు. సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో కోటి, ఐటీ రంగంలో 22 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎస్పీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే, విద్యాశాఖలో ఖాళీల భర్తీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్, అమ్మాయిలకు పీజీ వరకు ఉచిత విద్య, 2025 నాటికి రైతులను రుణ విముక్తులను చేయడం, రెండెకరాల లోపు ఉన్న వారికి ఎరువులు, బీపీఎల్ దిగువనున్న కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా రెండు గ్యాస్ సిలిండర్లు, ఆటో డ్రైవర్లకు నెలకు 3 లీటర్లు, ద్విచక్ర వాహనదారులకు లీటరు పెట్రోలు ఉచితంగా అందిస్తామని ఎస్పీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more