గోవా అసెంబ్లీ సరికొత్త నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. గోవా అసెంబ్లీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న మాజీ ముఖ్యమంత్రులకు, మాజీ స్పీకర్లకు, భవిష్యత్తులోనూ జీవిత కాల క్యాబినెట్ హోదా ఇచ్చేందుకు నాంది పలికింది. శాసనసభ్యులుగా 50 ఏళ్లు పూర్తి చేసుకన్న ప్రతీ సభ్యుడికి ఈ గౌరవాన్ని అందించాలని పూనుకున్నామన్నారు. 50 ఏళ్లుగా సదరు సభ్యులు రాష్ట్రం కోసం అందించిన విశిష్ట సేవలకు ఈ క్యాబినెట్ హోదాతో వారిని సత్కరించుకునే అవకాశం లభించడం తమ రాష్ట్రానికి దక్కిన అరుదైన అవకాశమని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్వయంగా ప్రకటించారు.
ఈ క్రమంలో తొలిసారిగా ఈ హోదాను అందుకుంటోన్న వ్యక్తిగా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్ రాణె నిలువనున్నారు. రాష్ట్రానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఆయనకు శాశ్వత (జీవిత కాల) కేబినెట్ మంత్రి హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని శాసనసభ్యుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గోవా రాష్ట్రానికి రాణె అందించిన గొప్ప సేవలను గుర్తిస్తూ జీవిత కాలం పాటు కేబినెట్ హోదా ఇవ్వనున్నట్టు సావంత్ తెలిపారు.
87 ఏళ్ల రాణె 1987 నుంచి 2007 మధ్య నాలుగు పర్యాయాలు గోవాకు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. స్పీకర్ గానూ పనిచేశారు. ఈ నిర్ణయం పట్ల రాణె తనయుడు, ప్రస్తుత బీజేపీ సర్కారులో వైద్య మంత్రిగా పనిచేస్తున్న విశ్వజిత్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘50 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా, స్పీకర్ గా, ముఖ్యమంత్రిగా అందించిన సేవలకు ఇంతకంటే గొప్ప గౌరవం ఏదీ లేదు. ఇందుకు గౌరవ ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు ధన్యవాదాలు’’ అని విశ్వజిత్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more