వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కనుమూరు రఘురామకృష్ణరాజు తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు స్థానానికి ఇటీవల వైసీపీ పార్టీ తరపున పోటీ చేసిన ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో వున్న వైరుద్యాల నేపథ్యంలో పార్టీ అధిష్టానంతో పాటు ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలపై కూడా నిత్యం విమర్శలు, అరోపణలు చేస్తునే ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఇసుక సమస్య నుంచి మద్యనిషేదం వరకు అన్ని సమస్యలపై అవగాహన కలిగిన ఆయన తాజాగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.
రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశ్యంతో.. తాను రాష్ట్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నానే తప్ప మరోటి కాదని పలు సందర్భాల్లో అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా పదేళ్ల పాటు చరిత్రలో నిలిచే ఆంధ్రప్రదేశ్.. కనీసం భావితరాల భవిష్యత్తుకు చక్కని భరోసా కల్పించాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఈ క్రమంలో తనపై అనర్హత వేటు వేయించాలని వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. అందుకుగాను తాను వైసీపీ ప్రభుత్వానికి వారం రోజుల వ్యవధి కల్పిస్తున్నానని చెప్పారు. సంక్రాంతి పండగ పర్వదినం లోపు తనపై అనర్హుడిగా ప్రకటించాలని లేదా తానే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.
రాజీనామా చేసిన తరువాత మళ్లీ ఎన్నికలకు వెళ్తానని రఘురామకృష్ణరాజు తెలిపారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ పాలనపై.. సీఎం వైఎస్ జగన్ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఈసడించుకుంటున్నారని అన్నారు. అధికార వైసీపీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో తన లోక్ సభ ఉపఎన్నికల ద్వారా తెలియజేస్తానని చెప్పారు. ఆ పార్టీ నుంచి తొలగించాలని చూసినప్పటికీ సాధ్యంకాలేదన్నారు. ఏపీకి పట్టిన దరిద్రం వదిలించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రాజధానిగా అమరావతి కొనసాగించాలన్నారు. కాగా, ఈనెల 5న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. దీంతో ఆయన త్వరలోనే కాషాయ కండువ కప్పుకోనున్నారనే వార్తలు వచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more