ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఆలోచనాత్మక పోస్టులు, వీడియోతో అభిమానులు, ఫాలోవర్లను అలరించడం మహీంద్రాకు ఇష్టం. తమ సొంత తెలివితేటలకు పనిచెప్పేవారిని శ్లాఘించడం ఆయనకు ప్రీతి. ఇటీవల మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి స్ర్కాప్ గా మారిన వాహనాల విడిభాగాలతో జీపును తయారు చేయడం ఆయనను దృష్టిని ఆకర్షించింది. పేద వర్గాలు ఇలా తమ కుటుంబంతో పాటు వెళ్లే కళను సాకరం చేసుకోవడం బాగుందంటూ కితాబిచ్చిన ఆయన.. ఈ వాహనదారుడికి బొలెరో ఇస్తానంటూ ప్రకటించారు.
అంతేకాదు.. ఎవరైనా నిజమైన అవసరంలో వున్నారంటే.. వారు అడగకుండానే.. వారిని సంప్రదించకుండానే అన్నం పెట్టేందుకు ఆయన వెనుకాడరు. ప్రతిభ చాటుకున్నవారితో పాటు ఇబ్బందుల్లో ఉన్నవారిని గుర్తించి.. అండగానూ నిలుస్తుంటారు. ఇదే క్రమంలో తాజాగా ఆయన మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. వైకల్యానికి వెరువక, రోజువారీ జీవనంలో దూసుకెళ్తోన్న ఓ దివ్యాంగుడి పట్టుదలకు ముగ్ధుడయిన ఆయన.. అంతటితో ఆగకుండా, అతనికి తన సంస్థలో ఉద్యోగాన్ని ఆఫర్ చేయడం విశేషం. ఆ వ్యక్తికి సంబంధించిన వీడియోను సోమవారం ట్వీట్ చేస్తూ.. ప్రశంసాపూర్వక వ్యాఖ్యలు చేశారు.
వీడియో చూస్తుంటే.. కాళ్లు, చేతులు సరిగా వృద్ధి చెందని ఓ వ్యక్తి.. తన లోపాలను అధిగమిస్తూ ఓ మోడిఫైడ్ వాహనాన్ని నడుపుతున్నట్లు కనిపిస్తోంది. ‘భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, ముసలి తండ్రి ఉన్నారు. అందుకే సంపాదన కోసం బయటకు వెళ్తున్నా. అయిదేళ్లుగా వాహనాన్ని నడుపుతున్నా’ అంటూ అతను వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇది కాస్త.. ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ‘ఈ రోజు నా టైమ్లైన్లో ఈ వీడియో కనిపించింది. ఇది ఎంత పాతదో, ఎక్కడ చిత్రీకరించారో తెలియదు. కానీ.. తన వైకల్యాన్ని ఎదుర్కోవడమే కాకుండా ఉన్నదాంతోనే కృతజ్ఞతా భావంతో మెలుగుతున్న ఈ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయా’ అని ఆనంద్ రాసుకొచ్చారు.
అంతటితో ముగించకుండా ఆయన మహీంద్రా లాజిస్టిక్స్ సంస్థలోని ఓ ఉద్యోగికి ఈ ట్వీట్ను ట్యాగ్ చేస్తూ.. ఇతన్ని బిజినెస్ అసోసియేట్ గా చేర్చగలరా?’ అని అడిగారు. ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారడంతో.. నెట్టింట విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియో ట్వీట్కు 1.70 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు సైతం ఆ దివ్యాంగుడిని ప్రశంసిస్తూ.. ఆనంద్ మహీంద్రా చొరవను కొనియాడుతున్నారు. ఓ నెటిజన్.. అతన్ని దిల్లీలోని మోహ్రౌలి ప్రాంతంలో చూసినట్లు కామెంట్ పెట్టాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తుక్కుతో తయారు చేసిన వాహనాన్ని చూసి మెచ్చుకున్న మహీంద్రా.. అతనికి బొలెరో ఇస్తానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.
Received this on my timeline today. Don’t know how old it is or where it’s from, but I’m awestruck by this gentleman who’s not just faced his disabilities but is GRATEFUL for what he has. Ram, can @Mahindralog_MLL make him a Business Associate for last mile delivery? pic.twitter.com/w3d63wEtvk
— anand mahindra (@anandmahindra) December 27, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more