దేశంలో కరోనా మహమ్మారిపై యుద్దాన్ని ప్రకటించిన కేంద్రం.. ఓ వైపు స్వదేశ పరిజ్ఞానంతో రూపోందించిన కరోనా వాక్సీన్ లను తయారుచేసి ప్రజలకు ఉచితంగా వేస్తూనే.. మరోవైపు విదేశీ పరిజ్ఞానంతో రూపోందించిన వైరస్లను కూడా ఉచితంగానే అందిస్తోంది. అదిచాలదన్నట్లు విదేశాలలో రూపోందించి, తయారు చేసిన వాక్సీన్లను కూడా దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశం నుంచి కరోనా మహమ్మారిని తరిమేసేలా చేస్తున్న పోరాటాన్ని.. మరో రెండు నూతనంగా రూపోందించిన వాక్సీన్లకు అనుమతిస్తూ అమోదం తెలిపింది. కొవొవ్యాక్స్, కార్బివాక్స్ టీకాలను అత్యవసర వినియోగం కింద ఆమోదించింది.
దేశంలోని 100 కోట్ల మందికి రెండు డోసులతో పాటు 60 ఏళ్లు పైబడి.. అనారోగ్య రుగ్మతలు వున్నవారికి ముందస్తు డోసుగా మూడవ డోసును కూడా అందించనుంది. ఇక తాజాగా 15 ఏళ్లకు పైబడిన చిన్నారులకు కూడా వాక్సీన్ ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం.. జనవరి 3వ తేదీ నుంచి దానిని దేశవ్యాప్తంగా అమలుపర్చానుంది. ఈ క్రమంలో వాక్సీన్ డోసుల సంఖ్య మరింతగా అవసరం పడనున్న నేపథ్యంలో తాజాగా రెండు వాక్సీన్లను కూడా అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. వాటిల్లో కోవీషీల్డ్ కరోనా వాక్సీన్ రూపోందించిన సీరం సంస్థ నుంచే తయారైన ‘కోవోవాక్స్’ కాగా, మరోకటి బయోలాజికల్-ఈ లిమిటెడ్ సంస్థ రూపోందించిన ‘కార్బివాక్స్’ లకు డీజీసిఐ అనుమతినిచ్చింది.
కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ఈ రెండు కరోనా వాక్సీన్ల వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విటర్ వేదికగా వెల్లడించారు. అమెరికాకు చెందిన నొవావాక్స్ నుంచి టీకా సాంకేతికతను పొందిన ఎస్ఐఐ కొవొవాక్స్ కొత్త టీకాను ఉత్పత్తి చేసింది. అత్యవసర వినియోగం నిమిత్తం ఈ ఏడాది అక్టోబరులోనే డిజీసిఐకు దరఖాస్తు చేసింది. బ్రిటన్, అమెరికాల్లో చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ డేటాను జతచేసింది. దీనిని పరిశీలించిన సీడీఎస్సీవో నిపుణుల బృందం అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని సిఫార్సు చేసింది. దీంతోపాటు కొన్ని పరిమితులకు లోబడి కార్బివాక్స్కు అనుమతినిచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more