ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిపై భయాందోళనలు వ్యక్తమవుతున్న నేపధ్యంలో వ్యాక్సిన్ వ్యూహంపై స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం నెలకొందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. నూతన వేరియంట్పై ప్రస్తుతం వాడుకలో ఉన్న కొవిడ్-19 వ్యాక్సిన్లు కచ్చితంగా పనిచేస్తాయని చెప్పలేమనే ప్రచారం సాగుతోందని అన్నారు. మనం దేశ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎలా పూర్తి చేయలనేదానిపై ఆచితూచి వ్యవహరించాలని, మరో బూస్టర్ డోస్తో ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేపట్టేందుకు సిద్ధం కావడాన్ని అంగీకరించాలని సూచించారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతులకు పరిహారం విషయంలో చేతులెత్తిసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరణించిన రైతుల జాబితా లేదని పరిహారం ఇచ్చేందుకు నిరాకరించడం ఎంతవరకు సమంజసమని ఆయన కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరిహారం చెల్లించకపోవడంతో పాటు మోదీ సర్కార్ కనీసం మరణించిన రైతులను గుర్తించలేదని దుయ్యబట్టారు. ఇది రైతులను అవమానించడం కాకమరేమిటని ప్రశ్నించారు.
రైతుల నిరసనల్లో మరణించిన అన్నదాతల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందా అని పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ వ్యవహారానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి రికార్డులు లేనందున అసలు పరిహారం ప్రశ్నే ఉత్పన్నం కాదని వ్యవసాయ శాఖ బదులిచ్చిందని రాహుల్ మండిపడ్డారు. మరణించిన రైతుల పేర్లు తెలియవని ప్రధాని మోదీ అసత్యాలు చెబుతున్నారని అన్నారు. ప్రధాని స్వయంగా తాను పొరపాటు చేశానని అంటూ రైతులకు క్షమాపణలు చెప్పారని, ఆయన చేసిన పొరపాటుకు 700 మంది రైతులు మరణిస్తే ఇప్పుడు వారి పేర్లు తనకు తెలియవని మోదీ బుకాయిస్తున్నారని విమర్శించారు.
వారికి గౌరవంగా దక్కాల్సినవి ఇచ్చి మీ హుందాతనం కాపాడుకునేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రధానిని రాహుల్ నిలదీశారు. రైతుల ఆందోళనలో మరణించిన 500 మంది రైతుల జాబితాను తాము అందచేస్తున్నామని మిగిలిన వారి పేర్లు త్వరలో అందచేస్తామని రాహుల్ చెప్పారు. మరణించిన రైతులకు సభలో సంతాపం తెలిపేందుకు ప్రభుత్వం రెండు నిమిషాల సమయం ఇవ్వలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద మరణించిన రైతుల జాబితా లేకుంటే తామిచ్చే జాబితా తీసుకుని బాధిత రైతాంగానికి పరిహారం చెల్లించాలని రాహుల్ డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more