కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. తొలిసారి ప్రజల భయాందోళన.. అప్రమత్తత కారణంగా తక్కువ సంఖ్యలో ప్రభావితం కాగా.. రెండో పర్యాయం మాత్రం దేశప్రజలను భయకంపితుల్ని చేసింది. వేగంగా వ్యాప్తిస్తూ.. కరోనా వైరస్ తొలిసారి కంటే రెట్టింపు వేగంతో విజృంభించి ఎంతోమందిని బలి తీసుకుంది. ఇక సెప్టెంబర్, అక్టోబర్ లలో మూడవ దశ ప్రభావం చూపుతుందన్న అంచనాలు మెళ్లిగా సన్నగిల్లి.. ప్రజలు నిర్లక్షంగా తిరుగుతున్న క్రమంలో మళ్లీ కరోనా మహమ్మారి కొత్త రూపంలో విజృంభించేందుకు సన్నధంగా వుంది. అందుకు కొత్తగా నమోదవుతున్న ఏవై 4.2 వేరియంట్ కేసులే నిదర్శనం.
కరోనా మహమ్మారి సాధారణ జలుబులా మారిందని.. ఇక దీంతో ఎలాంటి ఇబ్బంది లేదని పలు అధ్యయనాలు వెల్లడించిన తరుణంలో కరోనా ముప్పు సమసిపోలేదని, థర్డ్ వేవ్ ముప్పు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దేశంలో పలు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్ ఏవై.4.2 తీవ్ర భయాందోళనలు కలగజేస్తుంది. ఈ వేరియంట్కు సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కొత్త వేరియంట్.. సెకండ్ వేవ్ సమయంలో తీవ్ర నష్టం కలిగించిన డెల్టా ప్లస్ వేరియంట్ కుటుంబానికి చెందినది అని వైద్య నిపుణలు తెలిపారు.
దీని వల్ల కోవిడ్ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం అధికంగా ఉందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, కేరళ, తెలంగాణ, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో ఈ కొత్త వేరియంట్ ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అధికారులు ఈ కొత్త వేరియంట్ గురించి పరిశోధించే పనిలో ఉన్నారు. ఇక ప్రస్తుతం మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగింది. దేశంలో 16,156 కొత్త కేసులు నమోదు కాగా.. 733 మంది మరణించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,60,989 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more